నెలల తరబడి సాగిన చర్చల అనంతరం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒకే అయింది. ఈ ఒప్పందం ప్రారంభ దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం భారతదేశ వ్యవసాయం, పాడి రంగాలను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేయడం రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, భారతదేశం కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను క్రమంగా తగ్గించి, కొన్ని ఉత్పత్తులపై సున్నా సుంక విధానం అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు.

అయితే, ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలు పూర్తిగా తెరుచుకుంటాయా లేదా అనే అంశంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. కానీ అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ చేసిన ప్రకటన మాత్రం భారతదేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడం ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోని భారీ మార్కెట్కు చేరుతాయని.. ఇది గ్రామీణ అమెరికాకు భారీ ఆర్థిక లాభాలను తీసుకువస్తుందని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
రోలిన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 2024 నాటికి భారతదేశంతో అమెరికా వ్యవసాయ వాణిజ్య లోటు 1.3 బిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్లో పెరుగుతున్న జనాభా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కీలకమైన మార్కెట్గా మారిందని ఆమె పేర్కొన్నారు. 2025లో మాత్రమే అమెరికా నుంచి భారత్కు వ్యవసాయ ఎగుమతులు దాదాపు 1.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, పత్తి, సోయాబీన్ నూనె ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. తాజా ఒప్పందంతో ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికా ఉత్పత్తులతో పాటు.. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు కూడా భారతదేశానికి దిగుమతి కావచ్చు. ఇది భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, తక్కువ ధరల అమెరికన్ ఉత్పత్తులతో పోటీ పడాల్సి రావడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ వస్తువులపై సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడం వల్ల భారతీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని కాంగ్రెస్ హెచ్చరించింది. వ్యవసాయ రంగాన్ని తెరవడం ద్వారా రైతుల భద్రత ఎలా కాపాడబడుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించింది.
ట్రంప్ మాత్రం ఈ ఒప్పందం మోడీ కోరిక మేరకే కుదిరిందని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ Xలో స్పందిస్తూ, మొత్తం భారత మార్కెట్ను అమెరికాకు తెరవడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 2025 ఆగస్టులో అమెరికా భారత్పై 50 శాతం సుంకాన్ని విధించింది. ఇందులో 25 శాతం రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించినది. ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక సహాయం అందించేందుకు భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని అమెరికా ఆరోపించింది. తాజా ఒప్పందంతో సుంకాలు తగ్గుతాయని, అలాగే భారత్ రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తుందని ట్రంప్ తెలిపారు.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు లాభం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగం తెరుచుకోవడం వల్ల రైతులు తీవ్ర పోటీని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆహార ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నా, రైతుల ఆదాయ భద్రతపై ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడిన తర్వాతే దీని నిజమైన ప్రభావం స్పష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

టారిఫ్లపై ట్రంప్కు బిగ్ షాకిచ్చిన మన్హట్టన్ కోర్టు.. రూ. 12 లక్షల కోట్లు వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశాలు

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications