గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్న కీలకమైన మార్పులను గమనిస్తే అసలు కథ తెర వెనుక నెమ్మదిగా మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యూహాత్మక మార్పులే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి రహస్యంగా మార్గం సుగమం చేస్తున్నాయి.
ఇంధన రంగంలో మార్పులు
గత కొంత కాలంగా భారత ఇంధన రంగంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. రష్యా నుంచి వచ్చే చమురు వల్లనే అమెరికాతో భారత్ తో గొడవ పెట్టుకుంది. అయితే నవంబర్లో ఈ రష్యా బ్యారెళ్ల దిగుమతి ఒక్కసారిగా భారీగా తగ్గింది. ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. అక్టోబర్ నెల పరిమాణంలో దాదాపు సగం అంటే, రోజుకు సుమారు 9.48 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే భారత్కు చేరింది.
అమెరికా సుంకాల కారణంగా భవిష్యత్తులో సరఫరాలో అంతరాయాల ప్రమాదం పెరగవచ్చని భారత రిఫైనరీలు గ్రహించాయి. అందుకే భారత్ కొనుగోలు విధానాలను మార్చుకుంది. ఈ మార్పులే విస్తృతమైన India US Trade Deal కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అతి పెద్ద చిక్కుముడిని భారతదేశం స్వచ్ఛందంగా విప్పుతున్నట్లుగా దీనిని చూడవచ్చు.

సరైన నిర్ణయం
రష్యాకు బదులు వేరే చోట్ల చమురు కొనడం భారతదేశానికి ఖర్చుతో కూడుకున్నది. ఈ మార్పు వల్ల భారతదేశ వార్షిక చమురు దిగుమతుల బిల్లుపై 3-5 బిలియన్ డాలర్ల అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 88% దిగుమతి చేసుకుంటుంది. కాబటటి ఈ భారం చిన్నది కాదు. అయినప్పటికీ, ఆంక్షలు మరింత బిగుసుకుంటున్న నేపథ్యంలో సరఫరా ప్రమాదాన్ని తగ్గించడానికి.. న్యూఢిల్లీ ఈ ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బదులుగా మరింత స్థిరమైన, ఊహించదగిన సరఫరాను పొందాలని భారత్ కోరుకుంటోంది.
అమెరికాతో దీర్ఘకాలిక ఒప్పందాలు
ఇదే వ్యూహంలో భాగంగా భారత్.. అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి 2026 కోసం 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) దిగుమతి చేసుకోవడానికి ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత్ వార్షిక ఎల్పీజీ దిగుమతులలో దాదాపు పదో వంతు. ఇప్పటివరకు భారత్ కుదుర్చుకున్న అమెరికన్ ఇంధన ఒప్పందాలలో ఇది అత్యంత వ్యవస్థీకృతమైనది.
అంతేకాకుండా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు కూడా పెరిగాయి. అక్టోబర్లో ఈ దిగుమతులు దాదాపు మూడేళ్లలో అత్యధికంగా రోజుకు 5.4 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఈ చర్యలన్నీ భారత్ ఒకే సరఫరాదారుపై కేంద్రీకృతమై ఆధారపడకుండా, నెమ్మదిగా, వ్యూహాత్మకంగా వైవిధ్యభరిత సరఫరా వైపు అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తున్నాయి.
వాణిజ్యానికి దారి సుగమం
భారత్ తీసుకుంటున్న ఈ ఇంధన రంగ నిర్ణయాలను వాషింగ్టన్ నిశితంగా గమనిస్తోంది. అమెరికా ఈ సంవత్సరం భారతీయ ఎగుమతులపై సుంకాలను 50% వరకు పెంచినప్పటికీ.. అదే సుంకాల నోటిఫికేషన్లలో 200కు పైగా వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. అంటే.. చర్చలకు ద్వారం ఎప్పుడూ పూర్తిగా మూసివేయలేదన్నది స్పష్టం.
భారతదేశం కూడా రాజకీయంగా సున్నితమైన వ్యవసాయం వంటి రంగాలను రక్షించుకుంటూనే.. కొన్ని ఇతర రంగాలలో సౌలభ్యాన్ని చూపింది. దూరం నుంచి చూస్తే ఇవి ఘర్షణ వాతావరణంగా అనిపించినా.. ఇరుపక్షాల చర్యలు ఒక రకమైన పాజిటివిటీనే సూచిస్తున్నాయి.
త్వరలో శుభవార్త వస్తుందా?
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, India US Trade Deal చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని, ఇరుపక్షాలు సమతుల్యమైన, న్యాయమైన ఒప్పందానికి వచ్చిన తర్వాతే కొంత శుభవార్త వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే కాలపరిమితిని ప్రకటించడం లేదు. ఎందుకంటే గడువులు అనవసరమైన అంచనాలను పెంచుతాయి. భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్తోంది. ఒప్పందం న్యాయంగా, సమతుల్యంగా ఉంటేనే ముందుకు వెళ్తామని, తొందరపడబోమని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం ఉన్నత స్థాయి చర్చల రౌండ్లకు బదులుగా కస్టమ్స్, సర్టిఫికేషన్ నిబంధనలు, డిజిటల్ నియమాలు, సేవల వంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సమావేశమవుతున్నారు. రష్యా చమురు దిగుమతులు తగ్గడం, అమెరికాతో దీర్ఘకాలిక ఎల్పీజీ ఒప్పందం కుదరడం వంటి ఇంధన మార్పులు వంటివి చూస్తుంటే.. త్వరలో ఇరుదేశాలు మళ్లీ తిరిగి ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications