2026లో భారత నగరాలు ఆఫీస్ స్థలాల పోటీలో చైనాను మించిపోతున్నాయి? మరి ఆ 3 నగరాల్లో ఏవో తెలుసా!
భారతదేశం 2026లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆఫీస్ స్థలాల విస్తరణలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్ నగరాలు అత్యధిక గ్రేడ్-ఏ ఆఫీస్ స్థలాన్ని పొందే నగరాలుగా ఉంటాయని అంచనాలు ఉన్నాయి. CBRE అంచనాల ప్రకారం, బెంగళూరులో 13.09 మిలియన్ చ.అడుగుల, హైదరాబాద్లో 9.25 మిలియన్ చ.అడుగుల, ఢిల్లీ-ఎన్సీఆర్లో 8.98 మిలియన్ చ.అడుగుల కొత్త ఆఫీస్ స్థలాలు 2026లో జోడించబడతాయి. అంతేకాక, ముంబై కూడా 4.3 మిలియన్ చ.అడుగుల పైగా కొత్త ఆఫీస్ స్థలాన్ని అందిస్తుంది.
ఈ గణాంకాలు చైనాలోని షాంఘై, షెన్జెన్, బీజింగ్ వంటి పెద్ద ఆఫీస్ కేంద్రాలను భారత నగరాలు మించి పోతున్నాయి. అంటే, రీజియన్లో మూడు భారతీయ నగరాలు ముందంజలో ఉన్నందున, మొత్తం గ్రేడ్-ఏ ఆఫీస్ స్థలాల పరంగా భారత్ చైనా కన్నా ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

CBREలో ఇండియా, సౌత్-ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా చైర్మన్ & CEO అన్షుమన్ మేగజైన్ ETకు "భారతదేశం ఆఫీస్ స్థలాల విస్తరణలో అగ్రస్థానం సాధించడం, దేశం మీద కార్పొరేట్ విశ్వాసానికి సాక్ష్యంగా ఉంటుంది. మన అద్భుతమైన టాలెంట్, ఆపరేషనల్ స్కేల్ మద్దతుతో, గ్లోబల్ కాపబిలిటీ సెంటర్స్ (GCCs) మరియు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు దీర్ఘకాలికంగా భారత్లో స్థిరమైన ఉనికిని ఏర్పరుస్తున్నాయి" అని చెప్పారు.
భారత ఆఫీస్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఒక స్రాటజిక్ నిర్ణయంగా పరిగణిస్తున్నారు, ఎందుకంటే ఇది రిస్క్ను తగ్గిస్తుంది. నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ మరియు GCCs పెరుగుతున్న ప్రెజెన్స్ భారత్ను ఆకర్షణీయమైన ఆఫీస్ గమ్యస్థానంగా మార్చాయి.
బెంగళూరు దేశంలో అతిపెద్ద ఆఫీస్ హబ్గా కొనసాగుతోంది. దీనికి బలమైన కార్పొరేట్ టెనెంట్స్, స్థిరమైన డెవలపర్ బేస్, మరియు అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మద్దతు ఇస్తుంది. హైదరాబాద్ కూడా ప్రధాన ఆటగాడిగా ఎదుగుతోంది. తక్కువ ఆపరేటింగ్ ఖర్చులు, సమర్థవంతమైన పాలన, ఆధునిక లార్జ్-ఫార్మాట్ క్యాంపసులు దీని వృద్ధికి కారణమవుతున్నాయి. శివమ్ అగర్వాల్, సట్వా గ్రూప్ VP స్ట్రాటజిక్ గ్రోత్, ETకి "భారతదేశం తయారీ రంగంలో చైనా లాగా గ్లోబల్ కాపబిలిటీ క్యాపిటల్ గా మారింది. ఈ లీడర్షిప్ను కొనసాగించాలంటే వేగం మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్, ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య సక్రమమైన సహకారం అవసరం.
ఆఫీస్ స్థలాల పెరుగుదల ఇన్వెస్టర్ల, REITs, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా టెక్, BFSI, ఇంజినీరింగ్, R&D ఆపరేషన్లు దక్షిణ భారత నగరాల్లో పెరుగుతుండడం వలన ఈ వృద్ధి మరింత వేగవంతమవుతోంది. భారతీయ ఆఫీస్ మార్కెట్ వేగంగా మారుతుంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్ ముందుండగా, ముంబై కూడా కొత్త ఆఫీస్ స్థలంతో మద్దతు ఇస్తోంది. ఈ విస్తరణ కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు కార్పొరేట్ ల్యాండ్స్కేప్ పై గణనీయమైన ప్రభావం చూపనుంది.
భవిష్యత్తులో ఆఫీస్ స్థలాల రంగంలో కొత్త ట్రెండ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు కూడా స్మార్ట్ ఆఫీస్ల, ఆధునిక మరియు సౌకర్యవంతమైన వర్క్స్పేస్ల పై దృష్టి పెట్టే అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాక, డిజిటల్ పనితీరు, హైబ్రిడ్ మోడల్ (కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు వర్క్-ఫ్రం-హోం) పెరుగుతున్న తరహా అవసరాల కారణంగా, ఆఫీస్ స్థలాల డిమాండ్ మరింత పెరుగుతోంది. ప్రత్యేకంగా సౌత్ ఇండియా నగరాలు, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. ఈ నగరాలు కేవలం పెద్ద కంపెనీలకు ఆఫీస్ ప్రదేశాలను మాత్రమే అందించడంలో కాక, టెక్నాలజీ హబ్లుగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా, ఈ ప్రాంతాల్లో అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక క్యాంపసులు, సమర్థవంతమైన పాలన ద్వారా ఆఫీస్ రియల్ ఎస్టేట్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది.


Click it and Unblock the Notifications