భారత్ అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి నుంచి క్వాంటం యుగంలోకి అడుగుపెట్టింది. ఇది ఇప్పటివరకు మనం ఉపయోగిస్తున్న సాంప్రదాయ కంప్యూటింగ్ పరిమితులను దాటి, పూర్తిగా కొత్త సాంకేతిక ప్రపంచానికి దారితీసే చారిత్రక ఘట్టంగా భావించవచ్చు. డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత భారత సాంకేతిక ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఫిబ్రవరి 8న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ను భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు పునాదిరాయిగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. రూ. 6వేల కోట్ల నేషనల్ క్వాంటం మిషన్ మద్దతుతో రూపుదిద్దుకుంటున్న ఈ హబ్.. భారత్ను కేవలం టెక్నాలజీ వినియోగదారుడిగా కాకుండా లోతైన సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Amaravati క్వాంటం వ్యాలీ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ క్వాంటం ఎకోసిస్టమ్. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ హైటెక్ క్యాంపస్లో పరిశోధన, తయారీ, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధి అన్నీ ఒకే వేదికపై సమన్వయంగా పనిచేయనున్నాయి. ప్రభుత్వం, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అలాగే IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి పరిశ్రమ దిగ్గజాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోంది.
ఈ క్వాంటం వ్యాలీకి హృదయంగా నిలిచేది 133-క్విట్ క్వాంటం కంప్యూటర్. సాధారణ కంప్యూటర్లు 0 లేదా 1 అనే బిట్లతో పనిచేస్తే.. క్వాంటం కంప్యూటర్లోని క్విట్ ఒకేసారి 0, 1 లేదా రెండింటి స్థితిలో ఉండగలదు. దీనిని శాస్త్రీయంగా సూపర్పొజిషన్ అంటారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ యంత్రం IBM హెరాన్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని ప్రతి అదనపు క్విట్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఫలితంగా ఈ కంప్యూటర్ ఒకేసారి బిలియన్ల అవకాశాలను విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే సమస్యలను ఇది కొన్ని సెకన్లలో పరిష్కరించగలదు.
ఈ క్వాంటం వ్యాలీ అమరావతి రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు అవుతోంది. ఇది 17 రాష్ట్రాల్లో 43 సంస్థలతో విస్తరించిన నేషనల్ క్వాంటం మిషన్కు కేంద్ర నోడ్గా పనిచేయనుంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, రక్షణ, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో జాతీయ స్థాయి పరిశోధనకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 88 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సుమారు 2 వేల కిలోమీటర్ల క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్మించి, భారతదేశ వ్యూహాత్మక డేటాను హ్యాకింగ్కు అందకుండా రక్షించే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం పెట్టుకుంది.
జాతీయ భద్రత పరంగా చూస్తే, క్వాంటం టెక్నాలజీ ఇకపై ఒక ఎంపిక కాదు. అది తప్పనిసరి. ఇది భారత రక్షణ వ్యవస్థకు ఒక అదృశ్య కవచంలా మారనుంది. ఆరోగ్య రంగంలో కూడా దీని ప్రభావం విప్లవాత్మకమే. క్వాంటం సెన్సింగ్ ఆధారిత అత్యంత ఖచ్చితమైన రేడియేషన్ థెరపీ, ఆరోగ్యకరమైన కణజాలాన్ని దెబ్బతీయకుండా కణితులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఇస్తుంది.
భారతదేశం విక్సిత్ భారత్ దార్శనికత వైపు సాగుతున్న ఈ సమయంలో.. బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో క్వాంటం అక్షరాస్యతను చేర్చడం ద్వారా, రాబోయే తరం ఈ సాంకేతిక విప్లవానికి పూర్తిగా సిద్ధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమరావతి క్వాంటం వ్యాలీ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. అది భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే గేమ్ ఛేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications