భవిష్యత్ భారత్దే.. లక్ష యూనికార్న్స్, 20 లక్షల స్టార్టప్స్ స్థాపనకు అవకాశం
ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతుంటే, భారత్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఇదే స్థాయిని కొనసాగించేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యల గురించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
ఇండియా సక్సెస్ ఇన్నొవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సహా డిజిటలైజేషన్ పై ఆధారపడి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా భారత్ విజయవంతంగా ముందుగు సాగుతోందన్నారు. లక్ష యూనికార్న్స్, 20 లక్షల స్టార్టప్ కంపెనీలు స్థాపించే స్థాయిలో దేశం ఉన్నట్లు తెలిపారు.

భారత్లో నిర్మించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశాభివృద్ధిలో ఎంతగానో తోడ్పడినట్లు చంద్రశేఖర్ చెప్పారు. సాంకేతికతను అత్యత్తమ స్థాయిలో ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి తెలియజేశామన్నారు. ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థల డిజిటలైజేషన్ పరిధి పెంపు భవిష్యత్తులో మరింత వేగవంతం అవుతుందన్నారు.

డిజిటల్ లెగసీని కొనసాగిస్తూనే, దేశంలో సెమీ కండక్టర్స్ తయారీని ప్రోత్సహించేందుకు దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు డిజిటల్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముసాయిదా బిల్లును క్యాబినెట్ తాజాగా ఆమోదించినట్లు గుర్తు చేశారు. తద్వారా గ్లోబల్ టెక్, డిజిటల్ స్పేస్ లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు మంచి అవకాశం ఏర్పడనుంది.


Click it and Unblock the Notifications