Cars ban: ఆ కార్లను బ్యాన్ చేసిన ఇండియా.. మీ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి!
Cars ban: ఇండియాలో కార్ల వినియోగం పెరుగుతోంది. కరోనా సంక్షోభం అనంతరం ప్రజల్లో సొంత వాహనం కొనుక్కోవాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో ఎక్కువగా డీజిల్ కార్లు ఉపయోగిస్తుండగా అతికొద్ది మొత్తంలో పెట్రోల్, గ్యాస్, ఎలక్ట్రిక్ కార్లను వాడుతున్నారు. అయితే డీజిల్ కార్లు కొనాలనుకునే వారికి ఇది దుర్వార్తనే చెప్పవచ్చు.
డీజిల్ వాహనాలకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కాలుష్యాన్ని ఎదుర్కొంటూ, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో డీజిల్తో నడిచే వాహనాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం 2027 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా దీని ప్రభావం ఎక్కువగా కార్ల వినియోగదారులపై పడనున్నట్లు తెలుస్తోంది.

భారత ప్రభుత్వ నిర్ణయంతో ఇటు కార్ల తయారీ కంపెనీలు, అటు వినియోగదారులు అయోమయంలో పడ్డారు. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన పలు కార్లకు రిటైర్మెంట్ టైం వచ్చిందంటూ బాధ పడుతున్నారు. టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా సఫారి, మహీంద్రా థార్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, మహీంద్రా బొలెరో, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG హెక్టర్.. ఈ లిస్టులో ఉన్నాయి.
డీజిల్ కార్లపై పూర్తి నిషేధం విధించేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. మెట్రోలు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు బస్సులు మరియు రైళ్లు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ (ETAC) సైతం ఇదే సూచించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications