Manufacturing: దేశీయ తయారీ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రపంచ కర్మాగారంగా పేరుగాంచిన చైనాను తలదన్నేలా ఉరకలేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "ఆత్మనిర్భర్ భారత్","లోకల్ ఫర్ వోకల్" వంటి స్కీమ్స్ ద్వారా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని మోడీ సర్కారు పక్కాగా ప్లాన్ చేసింది. ఈ చర్యలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది.
విస్తృత శ్రేణి వ్యాపార వర్గానికి సంబంధించి తక్కువ తయారీ ఖర్చుల విషయంలో ఇండియా ఖచ్చితమైన స్కోర్ను పొందింది. ఓపెన్ ఫర్ బిజినెస్ కాటగిరీలో భారతదేశం 37వ స్థానంలో నిలిచింది. అయితే అనుకూల పన్ను వాతావరణం పరంగా మాత్రం 100కి కేవలం 16.2 రేటింగ్ను అందుకుంది. ఇక అవినీతి రహిత విభాగంలో 18.1 మరియు పారదర్శక ప్రభుత్వ విధానాలకు 3.5 రేటింగ్ సాధించింది.

ఇవిగాక ఆదాయ సమానత్వంలో 1.9, సురక్షి నివాసం కోసం 4.3, బాగా అభివృద్ధి చెందిన ప్రజారోగ్య వ్యవస్థలో 2.3 మరియు జీవన నాణ్యత విభాగంలో ఆర్థికంగా స్థిరత్వం కోసం 9.9 స్కోర్లను ఇండియా అందుకుంది. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పత్తికి కేంద్రంగా స్థాపించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా దేశ పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మార్చడానికి, ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అనుమతుల ఖర్చులను తగ్గించడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. దేశానికి ప్రధాన ఆర్థిక ప్రత్యర్థి చైనా మొత్తం "వ్యాపారం కోసం ఓపెన్" స్కోరు 17ను కలిగి ఉంది. తక్కువ తయారీ ఖర్చుల విషయానికి వస్తే, భారత్ వెనుకంజనే రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, ఇండోనేషియా, కంబోడియా, మలేషియా మరియు శ్రీలంక కూడా టాప్ 10లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications