ప్రపంచవ్యాప్తంగా ఏటా సైబర్ దాడుల వల్ల లక్షలాది కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఆయా దేశాలకు సంబంధించిన రాజకీయ, సైనిక, ఆర్థిక రహస్యాలను హ్యాకర్లు అక్రమంగా చేజిక్కించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భారత్ ప్రముఖ బాధితురాలిగా మారింది.
సైబర్ దాడులు చేసేందుకు హ్యాకర్లు భారత్ ను ఎక్కువగా లక్ష్యం చేసుకుంటున్నట్లు ప్రముఖ ల్యాండ్ స్కేప్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫారమ్ సైఫర్మా నివేదించింది. విద్య, పరిశోధన, ప్రభుత్వం, సైనిక రంగాల తర్వాత హెల్త్ కేర్ మీద వారు అధికంగా దృష్టి సారించినట్లు వెల్లడించింది. 2022లో దేశంలోని పలు సంస్థలు సగటున వారానికి 1,866 సైబర్టాక్లను ఎదుర్కొన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.

నివేదిక ప్రకారం.. మొత్తం ప్రపంచ వ్యాప్త సైబర్ అటాక్స్ లో భారత్ వాటా 13.7 శాతం కావడం కలవరపరుస్తోంది. వీటిలోనూ ప్రభుత్వ సంస్థలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 2021తో పోలిస్తే 2022లో ఏకంగా 95 శాతం పెరుగదల నమోదైంది. ఇక అమెరికాని 9.6, ఇండోనేషియాని 9.3, చైనాను 4.5 శాతం హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
"అంతర్జాతీయ విపణిలో ఇండియా ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇతర పెద్ద దేశాలను కాదని పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు వివిధ విషయాల్లో భారత్ కు మద్ధతుగా ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏజెన్సీల వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగించేందుకు ఇండియాపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారు" అని సైఫిర్మా CEO మరియు వ్యవస్థాపకులు కుమార్ రితేష్ తెలిపారు.
దేశంలో అత్యంత సాధారణ సైబర్ అటాక్స్ రకాలు ఫిషింగ్, మాల్వేర్ మరియు రాన్సమ్ వేర్ దాడులు. 2021లో 78 శాతం భారతీయ సంస్థలు రాన్సమ్ వేర్ దాడులను ఎదుర్కొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 80 శాతం దాడులు డేటా ఎన్క్రిప్షన్ కోసం చేసినవేనని తెలుస్తోంది. ఇలా ఇండియాను లక్ష్యంగా చేసుకున్న 39 సంస్థలను సైఫిర్మా గుర్తించినట్లు పేర్కొంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications