Fast charging EV: సాంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్ నుంచి దేశం వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కాగా భారత్ తాజాగా EV విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ను భారత్ రిలీజ్ చేసింది. ఇందుకోసం 'ఎక్స్పోనెంట్ ఎనర్జీ'తో 'ఒమేగా సీకి మొబిలిటీ' భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని సదరు కంపెనీ చెబుతోంది.

'OSM స్ట్రీమ్ సిటీ క్విక్' EV 6 నగరాల్లో ఉన్న ఎక్స్పోనెంట్ వేగవంతమైన ఛార్జింగ్ నెట్వర్క్పై 15 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 'డౌన్టైమ్ను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఈ వాహనంతో జరిపే ప్రతి ప్రయాణం డ్రైవర్లకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది' అని ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఉదయ్ నారంగ్ పేర్కొన్నారు.
2 లక్షల కి.మీలు లేదా ఐదేళ్ల వారంటీతో వచ్చే ఈ EV.. ఒక్కసారి ఛార్జింగ్పై 126 కిలోమీటర్ల సిటీ డ్రైవ్ పరిధిని కలిగి ఉంటుందని సమాచారం. దీని ధర 3.25 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా మరియు హైదరాబాద్లలో తన నెట్వర్క్ను విస్తరింపజేస్తుంది. ఈ ఏడాది ఢిల్లీ-NCR మరియు బెంగళూరులలో 100 ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేనున్నట్లు ఎక్స్పోనెంట్ ఎనర్జీ ప్రకటించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications