అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు..భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని.. రెండు దేశాల మధ్య జరిగిన చర్చల నిజ స్వరూపాన్ని అవి ప్రతిబింబించవని భారత్ స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు వెలువడిన నేపథ్యంలో.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మళ్లీ అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. వాణిజ్య చర్చలు నిలిచిపోయిన తర్వాత, ఆగస్టులో Trump ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం సుంకాలను విధించింది. ఈ సుంకాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ సుంకాలు అమల్లోకి వచ్చినప్పటికీ, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు నవంబర్లో గత ఏడాదితో పోలిస్తే 22 శాతం కంటే ఎక్కువగా పెరగడం విశేషం.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గత ఏడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఇరుదేశాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయని.. అనేక సందర్భాల్లో ఒప్పందానికి చాలా దగ్గరగా కూడా వచ్చాయని ఆయన చెప్పారు. అయితే, కొన్ని కీలక అంశాలపై విభేదాలు కొనసాగడం వల్లే ఒప్పందం పూర్తికాలేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఒప్పందం దాదాపు సిద్ధమై ఉండగా, మోడీ ట్రంప్కు ఫోన్ చేయకపోవడం వల్ల అది ముందుకు సాగలేదని ఆయన అన్నారు. అయితే, దీనిపై భారత్ స్పందిస్తూ.. గత ఏడాదిలో మోడీ, ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారని గుర్తుచేసింది. కేవలం ఒక ఫోన్ కాల్ కారణంగా ఒప్పందం నిలిచిపోయిందన్న వాదన సరైనది కాదని భారత్ పేర్కొంది.
వాణిజ్య చర్చల్లో వ్యవసాయం ప్రధాన అడ్డంకిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా ఒత్తిడి చేస్తుండగా.. భారత ప్రభుత్వం దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఒప్పందం ఆలస్యం అవుతోంది.
ఇటీవలి కాలంలో ట్రంప్ భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తతను తీసుకొచ్చాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఒత్తిడి పెంచడం, సుంకాల హెచ్చరికలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన అవసరాల కోసం చౌకైన రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది దేశ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని ఢిల్లీ తెలిపింది.
అయితే, సుంకాలు, రాజకీయ వ్యాఖ్యల మధ్య కూడా భారత్-అమెరికా సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని అధికారులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నా, వాణిజ్య రంగంలో మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications