అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు..భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని.. రెండు దేశాల మధ్య జరిగిన చర్చల నిజ స్వరూపాన్ని అవి ప్రతిబింబించవని భారత్ స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు వెలువడిన నేపథ్యంలో.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మళ్లీ అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. వాణిజ్య చర్చలు నిలిచిపోయిన తర్వాత, ఆగస్టులో Trump ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం సుంకాలను విధించింది. ఈ సుంకాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ సుంకాలు అమల్లోకి వచ్చినప్పటికీ, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు నవంబర్లో గత ఏడాదితో పోలిస్తే 22 శాతం కంటే ఎక్కువగా పెరగడం విశేషం.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గత ఏడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఇరుదేశాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయని.. అనేక సందర్భాల్లో ఒప్పందానికి చాలా దగ్గరగా కూడా వచ్చాయని ఆయన చెప్పారు. అయితే, కొన్ని కీలక అంశాలపై విభేదాలు కొనసాగడం వల్లే ఒప్పందం పూర్తికాలేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఒప్పందం దాదాపు సిద్ధమై ఉండగా, మోడీ ట్రంప్కు ఫోన్ చేయకపోవడం వల్ల అది ముందుకు సాగలేదని ఆయన అన్నారు. అయితే, దీనిపై భారత్ స్పందిస్తూ.. గత ఏడాదిలో మోడీ, ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారని గుర్తుచేసింది. కేవలం ఒక ఫోన్ కాల్ కారణంగా ఒప్పందం నిలిచిపోయిందన్న వాదన సరైనది కాదని భారత్ పేర్కొంది.
వాణిజ్య చర్చల్లో వ్యవసాయం ప్రధాన అడ్డంకిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా ఒత్తిడి చేస్తుండగా.. భారత ప్రభుత్వం దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఒప్పందం ఆలస్యం అవుతోంది.
ఇటీవలి కాలంలో ట్రంప్ భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తతను తీసుకొచ్చాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఒత్తిడి పెంచడం, సుంకాల హెచ్చరికలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన అవసరాల కోసం చౌకైన రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది దేశ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని ఢిల్లీ తెలిపింది.
అయితే, సుంకాలు, రాజకీయ వ్యాఖ్యల మధ్య కూడా భారత్-అమెరికా సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని అధికారులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నా, వాణిజ్య రంగంలో మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications