దాయాది దేశంతో పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగానే మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడి ద్వారా నౌకా నిర్మాణ సామర్థ్యం పెంచుతోంది. మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రూ.4,000 నుండి రూ.5,000 కోట్ల పెట్టుబడితో తన నౌకదళాన్ని దుర్భేధ్యమైన శత్రు వ్యవస్థగా తీర్చి దిద్దుతోంది.
ఈ మధ్య పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్త పరిణామాల మధ్య అరేబియన్ సముద్రంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్లో భారత నౌకాదళం చూపిన తెగువకు సముద్రశక్తిని మరింతగా పెంచాలన్న దిశగా ప్రణాళికలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ముంబై క్యాంపస్ సమీపంలోని 10 ఎకరాల సముద్ర ప్రదేశాన్ని తిరిగి పొందిన MDL, అక్కడ రెండు కొత్త బేసిన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా పెద్ద నౌకలు, సబ్మేరిన్లను ఒకేసారి నిర్మించడమే కాకుండా మరమ్మతులు కూడా చేయగల సామర్థ్యం కూడా ఏర్పడుతుంది.

ఈ తాజా విస్తరణతో MDL యొక్క డెడ్వెయిట్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 40 వేల టన్నుల నుంచి 80 వేల టన్నులకు కానుంది. అంటే రెండింతలు పెరుగుదల కానుంది. దీంతో పాటుగా నవా శేవా పోర్ట్లో ఇప్పటికే 37 ఎకరాలు పొలాలను సేకరించిన MDL.. భవిష్యత్తులో 2 లక్షల డెడ్వెయిట్ టన్నుల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.డెడ్వెయిట్ టన్నులు (DWT) అనేది ఒక ఓడ మోయగల గరిష్ట బరువును సూచిస్తుంది. ఇది ఓడలో ఉన్న కార్గో, ఇంధనం, నీరు, సిబ్బంది, సామాగ్రి మొదలైన వాటి బరువును కలిగి ఉంటుంది. దీన్ని మెట్రిక్ టన్నులలో కొలుస్తారు
ప్రస్తుతం, MDL ఒకేసారి 11 సబ్మేరిన్లు,10 వార్షిప్స్ నిర్మించగలదు. ప్రస్తుతం భారత నౌకాదళానికి ఈ సంస్థ రూ.1.06 లక్షల కోట్ల విలువైన రెండు మెజర్ సబ్మెరైన్ ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇవి భారత్ యొక్క అండర్సీ వార్ఫేర్ సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి.భారత్లో నౌకా నిర్మాణం వేగంగా పెరుగుతున్నప్పటికీ పొరుగుదేశం చైనా కన్నా తక్కువగానే ఉంది. 370కి పైగా నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్నిచైనా కలిగి ఉంది. అయితే స్వదేశీ మౌలిక సదుపాయాల పెంపు ద్వారా ఈ గ్యాప్ను తగ్గించేందుకు భారత్ కృషి చేస్తోంది.
భారత నౌకాదళం 2047 నాటికి 100 శాతం స్వదేశీకరణతో కూడిన 175 నౌకల సామర్థ్యం ఉన్న నేవీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. MDL తాజా విస్తరణతో ఈ లక్ష్యాన్ని భారత్ త్వరలోనే సాధించనుంది. భారత ప్రభుత్వానికి చెందిన MDL ఇప్పటివరకు 800కి పైగా నౌకలు, 31 వార్షిప్స్, 8 సబ్మేరిన్లు నిర్మించింది. అంతర్జాతీయ కస్టమర్లకు 214 నౌకలను ఎగుమతి చేసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications