చల్లబడ్డ భారత్-పాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు.. రాకెట్ల దూసుకెళ్తున్న షేర్లు..

ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య, గత శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు అంటే సోమవారం భారీగా విజృంభించాయి. ఉదయం 10 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,376 పాయింట్లు అంటే 2.88% పెరిగి 81,830.65కి చేరగా, నిఫ్టీ50 705 పాయింట్లు అంటే 2.94% పెరిగి 24,713 పాయింట్లకు చేరుకుంది. అయితే గత శుక్రవారం భారీ పతనాన్ని చూసిన సెన్సెక్స్-నిఫ్టీ, నేడు మాత్రం మంచి జోష్'తో ప్రారంభమైంది. భారతదేశం పాకిస్థాన్ కాల్పుల విరమణ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించిందని నిపుణులు అంటున్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే.

India-Pak ceasefire deal today Sensex surges 2300 points Nifty rose 24 700 these shares jumpes

705 పాయింట్లు లాభపడిన నిఫ్టీ : నిఫ్టీ ఇండెక్స్ ఇవాళ 706.6 పాయింట్లు పెరిగి 24,714.6 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో 49 కంపెనీల షేర్లు గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి, అంటే ఈ షేర్లు పెరిగాయి.

రాకెట్ల దూసుకెళ్తున్న ఈ స్టాక్‌లు : స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బిగ్ బూమ్ మధ్య దూసుకెళ్తున్న లార్జ్-క్యాప్ కంపెనీల షేర్లలో టాప్-10 స్టాక్‌లలో చూస్తే యాక్సిస్ బ్యాంక్ (4%), అదానీ పోర్ట్స్ (3.88%), బజాజ్ ఫిన్‌సర్వ్ (3.75%), ఎటర్నల్ షేర్ (3.61%), బజాజ్ ఫైనాన్స్ షేర్ (3.61%), NTPC షేర్ (3.50%), టాటా స్టీల్ షేర్ (3.40%), రిలయన్స్ షేర్ (3.23%), ICICI బ్యాంక్ షేర్ (2.90%), HDFC బ్యాంక్ షేర్ (2.85%) ఉన్నాయి.

Take a Poll

మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ స్టాక్‌ల గురించి మాట్లాడుకుంటే, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో చేరిన ఎస్కార్ట్స్ షేర్ (7.63%), సుజ్లాన్ షేర్ (7.32%), ఫస్ట్ క్రై షేర్ (7.22%), డిక్సన్ టెక్ షేర్ (6.40%), RVNL షేర్ (6.30%), IREDA షేర్ (5.43%) అధికంగా ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్ విభాగంలో పంజాబ్ కెమికల్ (13%) ఇంకా కెపిఇఎల్ 10% లాభంతో ట్రేడవుతున్నాయి.

గత శుక్రవారం భారీ తగ్గుదల : గత వారం చివరి రెండు ట్రేడింగ్ రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ తీవ్రమైన క్షీణతను చూసింది. గడిచిన శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ ముందు రోజు ముగింపు 80,334.81 నుండి పడిపోయింది. దింతో 78,968 స్థాయిలో ట్రేడింగ్ ప్రారంభించి రోజంతా రెడ్ జోన్‌లో ట్రేడింగ్‌ కొనసాగించింది. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి క్షీణత తగ్గినప్పటికీ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం పడిపోయి 79,454.47 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాగే NSE నిఫ్టీ కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 265.80 పాయింట్లు లేదా 1.10% తగ్గి 24,008 వద్ద ముగిసింది.

కాల్పుల విరమణ తర్వాత శుభ సంకేతాలు: ఇండో-పాక్ కాల్పుల విరమణ తర్వాత స్టాక్ మార్కెట్‌కు విదేశాల నుండి మంచి సంకేతాలు అందుతున్నాయి, దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం చాలా ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్‌లో 525 పాయింట్లు పెరిగి 24,610 స్థాయికి చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+