భారత్‌లో ప్రపంచ స్థాయి బ్యాంకులకు రెడీ అవుతున్న కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండవ దశ విలీనానికి సై..

భారత ప్రభుత్వం ప్రపంచ స్థాయి బ్యాంకులను నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ముంబైలో నవంబర్ 6న జరిగిన 12వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్‌క్లేవ్‌లో నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణదాతలతో కూర్చుని చర్చలు జరుపుతుంది. వారు పెద్ద బ్యాంకులుగా ఎలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నాము. ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తో కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

నేను అవును అని చెప్పే ముందు చాలా పని చేయాల్సి ఉంది. కానీ ఆ దిశలో పని ఇప్పటికే ప్రారంభమైందని చెప్పగలన అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య వెలువడటం విశేషం. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండవ దశ విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ 15న మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, చిన్న, మధ్యస్థాయి ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేసే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది.

India banking reforms PSB consolidation Nirmala Sitharaman Finance Minister India Indian economy public sector banks merger Indian banking sector world class banks India banking sector reforms PSB mergers Indian financial system global banks India economic growth banking policy government of India banking strategy

దీని ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరచడం, పరిమిత సంఖ్యలో అయినా స్థిరమైన, ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించడం. ఈ ప్రతిపాదనల ప్రకారం..ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) వంటి చిన్న, మధ్యస్థాయి బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చని సమాచారం.

ఇది బ్యాంకింగ్ రంగంలో సమర్థతను పెంచడం, మూలధన బలం పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల బ్యాంకులను నిర్మించడం వంటి లక్ష్యాలతో సరిపోతుంది. పెద్ద బ్యాంకులు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, విదేశీ కార్యకలాపాలను విస్తరించడంలో భారత బ్యాంకింగ్ రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అధికారికంగా ఈ విలీనం ప్రణాళికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

అక్టోబర్ 24న మనీకంట్రోల్ మరోసారి నివేదించినట్లు.. చాలా ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుతం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను తగ్గించడంపై దృష్టి పెడుతున్నాయి. 2019లో జరిగిన మొదటి దశ ఏకీకరణలో 10 ప్రభుత్వ బ్యాంకులు విలీనం కావడం ద్వారా 4 పెద్ద బ్యాంకులు ఏర్పడ్డాయి. రెండవ దశలో జరిగే విలీనాలు భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడానికి దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

క్తుప్తంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడుగులు భారత బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడం, పెద్ద మూలధన సామర్థ్యం గల సంస్థలను రూపొందించడం, క్రెడిట్ విస్తరణకు బలమైన వేదికను సిద్ధం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+