Rupee Payments: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది అనడంలో సందేహం లేదు. పాశ్చాత్య దేశాల పోకడలు, డాలర్ ఆధిపత్యం, చమురు ఉత్పత్తి వంటి పలు విషయాల్లో ఆయా దేశాల ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చివేసింది. ముఖ్యంగా డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
విశ్వగురువుగా అవతరించాలని చూస్తున్న భారత్.. అభివృద్ధి దిశగా ఎదగడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా యువాన్ ను వాడుకలోకి చొప్పించాలని పొరుగు దేశం చైనా తహతహలాడుతోంది. దానికి పోటీగా రూపీని హైలెట్ చేయాలని ఇండియా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్యాతో రూపీ-రూబుల్ బంధాన్ని కొనసాగిస్తోంది.

తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సైతం లోకల్ కరెన్సీలతో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. మిడిల్ ఈస్ట్ నుంచి మిలియనల్ కొద్దీ బ్యారెళ్ల చమురు కొనుగోళ్ల పేమెంట్స్ ఇకపై రూపాయిల్లో చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మొదటి చెల్లింపు సైతం పూర్తి చేసినట్లు పేర్కొంది.
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూపాయల్లో పేమెంట్ చేసినట్లు UAEలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దానికి ముందే ఓ UAE బంగారం ఎగుమతిదారు నుంచి 25 కిలోల బంగారాన్ని ఇండియాలోని ఓ కొనుగోలుదారు 128.4 మిలియన్ రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు.
వివిధ దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా.. ఇండియా రూపీ పేమెంట్స్ కు మొగ్గు చూపుతోంది. తద్వారా డాలర్ మార్పిడి ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. కేవలం కరెన్సీ చెల్లింపులే కాకుండా.. భారత UPI టెక్నాలజీని ఉపయోగించి సింగపూర్, ఫ్రాన్స్ తో ఆన్ లైన్ పేమెంట్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని దేశాలను ఈ ప్లాన్ లో భాగం చేయాలని భారత్ భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications