గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు..

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అనేకమంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో భాగంగా.. భారత విమానయాన సంస్థలు ఒక్కరోజులోనే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు Civil Aviation Ministry అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ ద్వారా వేలాది మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి చేరుకునే అవకాశం లభించనుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక విమానాల్లో IndiGo అత్యధికంగా 30 విమానాలను నడుపుతోంది. అలాగే Air India, Air India Express కలిపి మొత్తం 23 ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నాయి. అదనంగా.. ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా అవసరాన్ని బట్టి తమ సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సాధారణ విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో, ఈ ప్రత్యేక విమానాలు కీలకంగా మారాయి.

Indian airlines special flights 58 special flights India stranded passengers West Asia India evacuation flights Indian citizens return West Asia emergency flights India West Asia crisis evacuation India airlift operation repatriation flights India aviation news India Indian carriers evacuation Middle East crisis travel passengers stranded abroad India rescue flights civil aviation India 58

పశ్చిమాసియాలోని అనేక దేశాలు భద్రతా కారణాలతో తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయడం లేదా కఠిన ఆంక్షలు విధించడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక Flights ప్రధానంగా దుబాయ్, ఫుజైరా వంటి నగరాల నుంచి బయలుదేరి, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి కీలక భారతీయ నగరాలకు చేరుకుంటున్నాయి.

ప్రస్తుతం దుబాయ్ గగనతలం పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉండటంతో.. పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, ప్రయాణికులు తమ విమాన సంస్థ నుంచి స్పష్టమైన బయలుదేరే సమయ సమాచారం అందిన తర్వాత మాత్రమే విమానాశ్రయానికి రావాలని అధికారులు సూచించారు. ముందస్తుగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్లవద్దని స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు అబుధాబి నుంచి తమ విమాన కార్యకలాపాలను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు Etihad Airways ప్రకటించింది.

ఈ తరలింపు కార్యక్రమంలో ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. టికెట్ రద్దులు, రీషెడ్యూలింగ్, రిఫండ్‌లు, ఇతర సహాయక చర్యల విషయంలో ప్రయాణికులతో పారదర్శకంగా వ్యవహరించాలని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అదేవిధంగా ఈ సంక్షోభ సమయంలో విమాన టికెట్ ధరలు అదుపు తప్పకుండా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రయాణికులపై ఎలాంటి అనవసర ఆర్థిక భారం పడకుండా చూస్తామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.

మొత్తం మీద.. ఈ ప్రత్యేక విమానాల ఆపరేషన్ భారత ప్రభుత్వం, విమానయాన రంగం సమన్వయంతో చేపట్టిన కీలక చర్యగా భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు, అవసరమైతే మరిన్ని విమానాలను కూడా నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు పెద్ద ఊరటగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+