భారతదేశంలో ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం (Inflation) లెక్కించే పద్ధతిలో ప్రభుత్వం ఒక కీలకమైన మార్పు చేసింది. గత పదేళ్లకు పైగా మనం వాడుతున్న పాత పద్ధతికి స్వస్తి పలికి, నేటి కాలానికి తగ్గట్టుగా కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టింది. ఇది కేవలం గణాంకాల మార్పు మాత్రమే కాదు.. ఇది మీ బ్యాంక్ లోన్ ఈఎంఐలు (EMIs), సేవింగ్స్ , మీ నెలవారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

బేస్ ఇయర్ మార్పు: 2012 నుంచి 2024కి!
ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఒక 'బేస్ ఇయర్' (ఆధారిత సంవత్సరం) ఉంటుంది. ఇప్పటి వరకు మనం 2012 ధరలను ప్రామాణికంగా తీసుకునేవాళ్ళం. కానీ 2012 నాటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు. అప్పట్లో ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, యాప్ ఆధారిత సేవలు చాలా తక్కువ. మన ఖర్చు చేసే విధానం 12 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 2024 ను బేస్ ఇయర్గా ప్రకటించింది. అంటే, ఇకపై ప్రస్తుత ధరలను 2024 ధరలతో పోల్చి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.
ఆహార పదార్థాల ప్రాధాన్యత తగ్గింది
పాత పద్ధతిలో ద్రవ్యోల్బణం లెక్కల్లో ఆహార పదార్థాల వాటా (Weightage) దాదాపు 46% ఉండేది. అంటే టమోటాలు, ఉల్లిపాయల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అంకెలు అమాంతం పెరిగిపోయేవి. కానీ కొత్త సిరీస్ లో ఆహార పదార్థాల వాటాను 37% కి తగ్గించారు. దీనివల్ల కూరగాయల ధరల్లో వచ్చే అకస్మాత్తు మార్పులు మొత్తం దేశ ఆర్థిక గణాంకాలను మునుపటిలా ప్రభావితం చేయవు.
ఇకపై ఇంటి అద్దెలు కూడా కీలకం
మనం తినే ఆహారం కంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలాంటి సేవలను పొందుతున్నాం అనేదానికి కొత్త పద్ధతిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
- హౌసింగ్ (Housing): పట్టణ ప్రాంతాల్లో పెరిగే ఇంటి అద్దెలు ఇకపై ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
- సేవలు (Services): వైద్య ఖర్చులు, స్కూల్ ఫీజులు, రవాణా ఛార్జీలు వంటి సేవలకు వెయిటేజీ పెంచారు. మీరు మెట్రో సిటీల్లో ఉంటూ ఎక్కువ అద్దె కడుతుంటే, ప్రభుత్వం చెప్పే ద్రవ్యోల్బణం నంబర్ ఇప్పుడు మీ అసలు ఖర్చులకు దగ్గరగా అనిపిస్తుంది. మునుపటిలా కేవలం ప్లేటులో ఉన్న ఆహారం మాత్రమే కాకుండా మీరు నివసించే ఇల్లు కూడా ఇన్ఫ్లేషన్ను నిర్ణయిస్తుంది.
కొత్త ఐటమ్స్ చేరిక
గతంలో 299 వస్తువుల ధరలను మాత్రమే ట్రాక్ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 358 కి పెంచారు. ఆధునిక కాలంలో మనం ఎక్కువగా వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ సేవలను కూడా ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల దేశంలో ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనే విషయంలో మరింత ఖచ్చితత్వం వస్తుంది.
దీనివల్ల మీకు కలిగే లాభం ఏమిటి?
ద్రవ్యోల్బణం (Inflation) గణాంకాల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. కొత్త పద్ధతిలో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైతే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే.. వడ్డీ రేట్ల తగ్గింపు మరికొంత కాలం ఆలస్యం కావచ్చు.
మొత్తానికి ప్రభుత్వం చేసిన ఈ మార్పు సామాన్యుడి జీవనశైలికి అద్దం పట్టేలా ఉంది. మనం తినే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మన పిల్లల చదువులకు, ఆరోగ్యానికి, నివాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ కొత్త లెక్కలు చెబుతున్నాయి. ఇకపై ద్రవ్యోల్బణం పెరిగిందని వార్త వస్తే.. అది కేవలం ఉల్లిపాయల ధర వల్ల కాదు. మీ ఇంటి అద్దె లేదా ఇతర సేవల ధరల వల్ల కూడా కావచ్చని గుర్తుంచుకోండి.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications