Hurun Unicorns Report: గత కొంతకాలంగా దేశంలో స్టార్టప్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ 1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కలిగిన యూనికార్న్స్ చాలా నెలకొల్పబడ్డాయి. తాజాగా రిలీజ్ అయిన నివేదిక ప్రకారం ఈ విషయంలో ప్రపంచంలో మేటి దేశంగా భారత్ నిలిచినట్లు కనిపిస్తోంది. అయితే కొంత డ్యామేజ్ అయిన మాట కూడా అంగీకరించి తీరాల్సిందే.
దేశంలో 1 బిలియన్ డాలర్లకు పైగా విలువైన యునికార్న్ల సంఖ్య నాలుగేళ్లలో మొదటిసారిగా 67కి తగ్గిందని హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2024 నివేదిక తెలిపింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యునికార్న్లకు భారత్ మూడవ అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్లు పేర్కొంది. గతంలో 22 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఈ జాబితా నుంచి తొలగించబడినట్లు వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఏ స్టార్టప్ కూడా బైజూస్ అంత రేంజ్లో వాల్యుయేషన్ తగ్గుదల నమోదు చేయలేదు. తన కార్యకలాపాలను పునర్నిర్మించడం సహా పెరుగుతున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఖర్చులను తగ్గించుకోవడంతో దాని గౌరవనీయమైన స్థానాన్ని కోల్పోయింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1.2 బిలియన్ డాలర్ల మేర రుణ భారాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తోంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ మరియు ఫాంటసీ స్పోర్ట్స్-ఫోకస్డ్ డ్రీమ్11 భారతదేశంలోని అత్యంత విలువైన యునికార్న్లుగా కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 8 బిలియన్ డాలర్లు వాల్యుయేషన్ కలిగి ఉన్నాయి. ఇక రేజర్పే 7.5 బిలియన్ డాలర్లతో వాటి వెన్నంటే ఉంది. రెండు అత్యంత విలువైన భారతీయ యునికార్న్లు ప్రపంచవ్యాప్తంగా 83వ స్థానంలో ఉండగా.. రేజర్పే 94వ స్థానంలో నిలిచింది.
ఇతర దేశాల్లో కంపెనీని ప్రారంభించాలనే ధోరణి భారతదేశానికి ఉన్న అవకాశాలను కూడా దెబ్బతీసిందని హురున్ రిపోర్ట్ ఛైర్మన్ మరియు ప్రధాన పరిశోధకుడు రూపెర్ట్ హూగ్వెర్ఫ్ అభిప్రాయపడ్డారు. ఇండియాకు చెందిన వ్యవస్థాపకులు దేశం వెలుపల 109, భారత్లో 67 యునికార్న్లను ప్రారంభించినట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications