కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. గత సీజన్ లో పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా 40% కంటే ఎక్కువగా ఉంది. ఇది 2022లో 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
భారత్ బియ్యం ఎగుమతులు 2022లో రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో భారత్ తర్వాత థాయ్లాండ్, వియత్నాం, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. భారత్ 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది. భారతీయ బాస్మతీయేతర బియ్యం ముఖ్య కొనుగోలుదారులుగా బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ప్రధానంగా భారతదేశం నుంచి ప్రీమియం బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి.

భారతదేశం 2022లో 17.86 మిలియన్ టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. 2022లో వరుసగా 4.4 మిలియన్ టన్నులు, 7.4 మిలియన్ టన్నులుగా ఉన్న బాస్మతి బియ్యం, పారబాయిల్డ్ రైస్ ఎగుమతి చేశాయి. భారతీయ రైతులు సంవత్సరానికి రెండుసార్లు వరి సాగు చేస్తారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ దేశంలో వరి ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలుగా ఉన్నాయి.
వరి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి, భారతదేశం రైతుల నుంచి కొత్త-సీజన్ సాధారణ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ధరను 100 కిలోలకు 7% పెంచి 2,183 రూపాయలకు ($26.63) పెంచింది. కానీ 2023లో రుతుపవన వర్షపాతం అస్తవ్యస్తంగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గుతుందని పరిశ్రమ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో జూన్ మధ్యకాలం వరకు భారీ వర్షాల లోటు ఏర్పడింది. జూన్ చివరి వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు లోటును పోగొట్టగా, పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications