ముంబై అంటేనే వేగం, ట్రాఫిక్.. కానీ ఇప్పుడు అదే ముంబై రోడ్లు పాటలు పాడుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కోస్టల్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఇప్పుడు ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతోంది. ఇండియాలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు (musical road) ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ రోడ్డుపై మీరు నిర్ణీత వేగంతో కారు నడుపుతుంటే.. ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన 'జై హో' ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది.

అసలు ఈ మ్యూజికల్ రోడ్ అంటే ఏమిటి?
మ్యూజికల్ రోడ్ అంటే ఏదో స్పీకర్లు పెట్టి పాటలు ప్లే చేయడం కాదు. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ అద్భుతం. రోడ్డు ఉపరితలంపై నిర్దిష్టమైన లోతు , దూరంలో చిన్న చిన్న గీతలు (Grooves) చెక్కుతారు. వీటినే 'రంబుల్ స్ట్రిప్స్' అని కూడా అంటారు. వాహనం ఈ గీతలపై నుంచి వెళ్తున్నప్పుడు టైర్లకు, రోడ్డుకు మధ్య ఏర్పడే ఘర్షణ (Friction) వల్ల ప్రకంపనలు (Vibrations) పుడతాయి. ఆ కంపనాల ద్వారా సంగీతం వెలువడుతుంది. హంగేరీ దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముంబైలో దీనిని రూపొందించారు.
'జై హో' ట్యూన్ వినాలంటే ఏం చేయాలి?
ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్లే కోస్టల్ రోడ్డులో సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్డు (musical road) ఏర్పాటు చేశారు. దీనిని ధర్మవీర్ స్వరాజ్యరక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ అని పిలుస్తారు. వర్లీ వైపు వెళ్లే టన్నెల్ దాటిన తర్వాత మొదటి లైన్లో ఈ మ్యూజికల్ స్ట్రిప్స్ ఉంటాయి. వాహనదారులు తమ కారును గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో నడిపినప్పుడు మాత్రమే ఆ 'జై హో' ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. వేగం అంతకంటే తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ట్యూన్ లయ తప్పుతుంది.
ఎందుకు ఈ ప్రయోగం?
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సుమారు రూ. 6.21 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ప్రయాణికులకు బోర్ కొట్టకుండా, సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే డ్రైవర్లు నిర్ణీత వేగాన్ని పాటించేలా ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ప్రపంచవ్యాప్తంగా జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా , యూఏఈ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.
ముంబై వెళ్లే పర్యాటకులు, స్థానికులు ఈ వినూత్న అనుభవాన్ని మిస్ కావద్దని అధికారులు కోరుతున్నారు. రహదారిపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దేశభక్తిని చాటే 'జై హో' ధ్వని వినిపించడం వాహనదారులకు గర్వకారణంగా అనిపిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్ముందు దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి టెక్నాలజీని చూసే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications