న్యూఢిల్లీ: దేశ డిజిటల్ ఎకానమిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి దీని పురోగమనం ఎలా ఉంటుందనేది అంచనా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల నుంచి గట్టెక్కడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం, ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోన్న ద్రవ్యోల్బణం.. వంటి ప్రతికూల వాతావరణంలో దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఎనిమిదేళ్లలో ఎలా ఉండొచ్చనే విషయంపై తన అభిప్రాయాలను తెలిపారు.
ఐఐటీ- బోంబే ఆలమ్నీ అసోసియేషన్ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం కొనసాగింది. 2030 నాటికి దేశంలో డిజిటల్ విప్లవం పతాక స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎనిమిదేళ్లల్లో 800 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఎకానమి గ్రోత్ నమోదవుతుందని అంచనా వేశారు. దేశంలో ఇప్పటికే 6,300 వరకు ఫిన్టెక్స్ ఉన్నాయని, ఇందులో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీలో 27, పేమెంట్స్లో 16, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తొమ్మిది శాతం వాటా ఉందని అన్నారు.

2020 క్యాలెండర్ ఇయర్లో 85 నుంచి 90 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఎకానమి నమోదు చేసుకుందని నిర్మల సీతారామన్ వివరించారు. 2030 నాటికి ఇది 800 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగం, యువత ఆర్థిక వనరులు పెరగడం వంటి కార్యకలాపాల వల్ల ఇది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్స్లల్లో రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి నిబంధనలను మరింత సరళీకరించామని అన్నారు.
2016 మార్చి నుంచి గత సంవత్సరం మార్చి నాటికి రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెట్టింపయిందని నిర్మల సీతారామన్ చెప్పారు. 45 మిలియన్లుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 88.2కు చేరిందని, ఇది మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఎకానమిని ప్రోత్సహించే క్రమంలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వార్షిక బడ్జెట్లో దీన్ని పొందుపరిచినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications