డేటా సెంటర్లకు కేరాఫ్ గా మారిన ఇండియా! 2030 నాటికి ఎలా ఉండబోతుందంటే..

భారతదేశం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది! మన దేశం ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌గా మారింది. అంటే.. కంపెనీలు తమ డేటాను భద్రపరిచే పెద్ద పెద్ద భవనాలు, సర్వర్లు మన దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
తాజాగా విడుదలైన CBRE పరిశోధన నివేదిక ప్రకారం.. 2025లో మూడవ త్రైమాసికం (Q3) నాటికి, భారతదేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం ఏకంగా 1.5 గిగావాట్లను (GW) దాటింది. అంటే, గత సంవత్సరం కంటే ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది! దీనితో ఆసియా ప్రాంతంలో ఇండియా ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలిచింది.

india data center market growth 2030 hydereabad Bengaluru vizag

తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం!

ఇండియా ఇంత వేగంగా ఎదగడానికి కారణాలు చాలా ఉన్నాయి:

  • తక్కువ ఖర్చు: జపాన్, సింగపూర్‌ లాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో డేటా సెంటర్‌ నిర్మాణ ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి.
  • ప్రభుత్వ ప్రోత్సాహకాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మంచి పాలసీల మద్దతు.
  • డిజిటల్ వృద్ధి: మన దేశంలో ఇంటర్నెట్, డిజిటల్ సేవలు విపరీతంగా పెరగడం.

సముద్ర తీరం - డిజిటల్ హైవే!

భారతదేశానికి అండగా నిలుస్తున్న మరొక ముఖ్య విషయం- సముద్ర గర్భంలో వేసిన కేబుల్స్ (Subsea Cables). ప్రపంచవ్యాప్తంగా డేటా ట్రాఫిక్‌ను నడిపించే ఈ కేబుల్స్‌లో సగానికి పైగా ముంబై మరియు చెన్నైలలోనే ఉన్నాయి. ఇది మన దేశానికి పశ్చిమాన ఉన్న మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా మరియు ఐరోపా దేశాలతో వేగవంతమైన కనెక్టివిటీని ఇస్తోంది. అంతేకాదు, 2025 నుంచి 2028 మధ్య కాలంలో మరో 12 కొత్త సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇది మన డిజిటల్ వ్యవస్థకు మరింత బలాన్నిస్తుంది. తాజాగా వైజాగ్ లో కూడా గూగుల్ భారీ డేటా సెంటర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

ఎక్కడ పెరుగుదల ఎక్కువ?

  • ముంబై: ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద DC మార్కెట్‌ ముంబై. ఇక్కడ 56GW కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది.
  • బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్: క్లౌడ్ సేవలు, ప్రభుత్వ డిమాండ్ మరియు టెలికాం రంగ విస్తరణ కారణంగా ఈ నగరాలు బలంగా ఎదుగుతున్నాయి.
  • హైదరాబాద్, వైజాగ్, పూణె: ఈ టైర్-II నగరాలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 2025 నాటికి ఇక్కడ ఏటా 15 నుంచి 26 శాతం వరకు వృద్ధి అంచనా వేశారు.

ఫ్యూచర్ లో ఇలా..

భారతదేశ డేటా సెంటర్ మార్కెట్‌ను భవిష్యత్తులో ప్రధానంగా ముందుకు నడిపించే అంశాలు ఇవే:
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): ఏఐ (AI) అవసరాలు, దానికి కావాల్సిన శక్తివంతమైన కంప్యూటర్లు (GPU) భారీగా పెరుగుతాయి. ఏఐ రంగంలో 2030 నాటికి 36 శాతం వృద్ధి ఉంటుందని అంచనా.
2. క్లౌడ్ కంప్యూటింగ్: ఎంటర్‌ప్రైజ్ కంపెనీలు మరియు 800కు పైగా ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) కారణంగా క్లౌడ్ సేవలను స్వీకరించడంలో ఇండియా ఆసియా దేశాల కంటే వేగంగా ఉంది.
3. డేటా గోప్యతా చట్టం: 'డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (2023)' కారణంగా.. భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సిన అవసరం పెరుగుతోంది.

పెట్టుబడుల ప్రవాహం!

2025 నాటికి, భారతదేశ డేటా సెంటర్ రంగంలోకి ఇప్పటి వరకు 30 బిలియన్ డాలర్లు(సుమారు ₹2.5 లక్షల కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, పెద్ద క్లౌడ్ కంపెనీలు ఇందులో ముఖ్యంగా పాలుపంచుకున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి.

2030 నాటికి.. గ్లోబల్ లీడర్!

భారతదేశంలో డిజిటల్ జనాభా పెరగడం, ఓటీటీ (OTT) వినియోగం పెరగడం, ఏఐ (AI) అభివృద్ధి చెందడం చూస్తుంటే... రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు మరింత పెరుగుతాయని అంచనా. 2030 నాటికి, తక్కువ ఖర్చు, పటిష్టమైన కనెక్టివిటీ మరియు బలమైన పునాదుల కారణంగా... డేటా సెంటర్ సామర్థ్యంలో భారతదేశం గ్లోబల్ లీడర్ గా నిలుస్తుందని CBRE నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా కల నెరవేరే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అనే చెప్పాలి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+