Inflation: ఏడాదిన్నర కనిష్ఠానికి ద్రవ్యోల్బణం.. వరుసగా రెండోసారి RBI టాలరెన్స్ పరిధిలోకి..
Inflation: అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం పడినట్లే కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాలరెన్స్ స్థాయిని సైతం దాటి, ఆర్థిక వ్యవస్థకు చమటలు పట్టించిన ఇన్ఫ్లేషన్ ఎట్టకేలకు దిగివస్తోంది. మార్చి నుంచి మొదలైన క్షీణత మరో నెలపాటు కొనసాగి, ఏప్రిల్ లో మరింత దిగజారడం శుభపరిణామం.
అక్టోబర్ 2021 నుంచి చూస్తే భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు కనిష్ఠ స్థాయికి చేరింది. వరుసగా రెండవ నెలలో సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం పరిధిలోకి పడిపోయింది. తద్వారా రేట్ల పెంపు నుంచి మరింత విముక్తి లభించే అవకాశం ఉదంని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చిలో అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా దాని ప్రభావం ఏప్రిల్ పైనా పడినట్లు కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఆర్థికవేత్త సువోదీప్ రక్షిత్ తెలిపారు.

వినియోగదారుల ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతంగా నమోదైంది. దానితో పోలిస్తే ఏప్రిల్లో 4.7కు క్షీణించినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ డేటా నివేదించింది. 39 మంది ఆర్థికవేత్తలతో కూడిన బ్లూమ్బెర్గ్ ప్యానెల్ పోల్ సైతం గత నెలలో ద్రవ్యోల్బణం 4.76 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.
ఈ ఏడాది జనవరి మరియు ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉంది. RBI టాలరెన్స్ బ్యాండ్ 4 ప్లస్ లేదా మైనస్ 2 శాతం పరిధికి పైగానే నమోదైంది అయితే గత రెండు నెలల నుంచి మెల్లమెల్లగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. FY24కి గాను ద్రవ్యోల్బణం సుమారు 5.2 శాతానికి చేరువలో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications