India Cements: దేశంలోని సిమెంట్ వ్యాపార రంగంలో పోటీ భారీగా పెరిగింది. ఈ రంగంపై గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఫోకస్ పెట్టడం వరుసగా అనేక కంపెనీలను కొనుగోలు చేయటం దీనికి నిదర్శనంగా ఉంది. దేశంలో ఈ వ్యాపారంలో మెుదటి స్థానంలో ఉన్న బిర్లాలను అధిగమించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
దీనిని సీరియస్గా తీసుకున్న బిర్లా గ్రూప్ సైతం అదే స్థాయిలో కొత్త కంపెనీల కొనుగోళ్లు, ఇతర కంపెనీల్లో మెజారిటీ వాటాల కొనుగోళ్లు చేపడుతోంది. ఈ క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్ డైరెక్టర్ల బోర్డు నేడు జరిగిన సమావేశంలో ఇండియా సిమెంట్స్ కంపెనీలో ప్రమోటర్లు వారి సహచరుల నుంచి 32.72 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ వాటాల కొనుగోలుకు అల్ట్రాటెక్ రూ.3,954 కోట్లను వెచ్చించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో షేరును రూ.390కు కొనుగోలు చేయనుంది.

అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్స్ కంపెనీ షేర్లకు ఆఫర్ చేస్తున్న ధర గడచిన శుక్రవారం స్టాక్ ముగింపు ధర రూ.374.60 కంటే 4.1 శాతం అధికం. జూన్ 2024లో ఒక్కో షేరుకు రూ.268 చొప్పున 22.77 శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు కంపెనీ ఇండియా సిమెంట్స్లో ఆర్థిక పెట్టుబడి పెట్టిందని పేర్కొంది. ఈ ఆర్థిక పెట్టుబడి తర్వాత కంపెనీలో తమ హోల్డింగ్ను విక్రయించాలనుకుంటున్నందున ప్రమోటర్ గ్రూప్ సంప్రదించినట్లు అల్ట్రాటెక్ సిమెంట్స్ బోర్డ్ పేర్కొంది.
అల్ట్రాటెక్ పెట్టుబడులు (సేంద్రీయ, అకర్బన) సంవత్సరాలుగా భారత్ను ప్రపంచవ్యాప్తంగా బిల్డింగ్ సొల్యూషన్స్ ఛాంపియన్గా మార్చేందుకు రూపొందించబడిందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. సిమెంట్ వంటి ప్రధాన రంగంలో ప్రతి పెట్టుబడి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
గృహాలు, రోడ్లు, ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాల కోసం మన దేశానికి పెరుగుతున్న అవసరాన్ని శక్తివంతం చేస్తూ ప్రజల జీవితాలు, ఆకాంక్షలపై ప్రభావాన్ని చూపిందని బిర్లా పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు దేశంలో దక్షిణాది మార్కెట్లకు మరింత ప్రభావవంతంగా సేవలు అందించడానికి అల్ట్రాటెక్ని అనుమతిస్తుందని చెప్పారు. ఇది అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications