India-Canada tensions: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్-కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చినా.. పదేపదే అవే నిందలు వేస్తూ మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
దౌత్య సంబంధాలు తీవ్రంగా క్షీణించిన ప్రస్తుత సమయంలో.. ఇరుదేశ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(CPPIB), కెనడా పెన్షన్ ప్లాన్(CPP)లు మన మార్కెట్లలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అక్కో, జొమాటో, కోటక్ మహీంద్రాబ్యాంక్, ICICI బ్యాంక్ సహా IT దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో వంటి పలు భారతీయ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాయి.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనతో CPPIB హోల్డ్ చేస్తున్న స్టాక్స్ వాల్యూ ఇప్పటికే దెబ్బతింది. ఇండియన్ మార్కెట్లలో మొత్తం21 బిలియన్ డాలర్లు తాము పెట్టుబడిపెట్టినట్లు ఏడాది క్రితమే CPPIB నివేదించింది. దీంతో అది ఇన్వెస్ట్ చేసిన ఇండస్ టవర్స్, నైకా, జొమాటో, పేటీఎం, డెల్లివరీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
జూన్ 2023 నాటికి CPPIB జొమాటోలో 20.35 కోట్ల ఈక్విటీ షేర్లు(2.37% వాటా) కలిగి ఉంది. వీటితో పాటు 4.3 కోట్ల డెల్లివెరీ షేర్లు(6% వాటా), ఇండస్ టవర్స్లో 2.18 శాతం, వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం)లో 1.76 శాతం, FSN ఇ-కామర్స్ వెంచర్స్లో 1.47 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. ఈ దుమారానికి తోడు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)పై చర్చలు నిలిచిపోవడమూ మరింత ఆందోళన కలిగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications