పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బుధవారం ఉదయం భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ చర్య తీసుకుంది. ఈ ఆపరేషన్కు సైన్యం 'ఆపరేషన్ సింధూర్ ' అని పేరు పెట్టింది. అయితే ఈ దాడితో భారత స్టాక్ మార్కెట్ కాస్త హుషారుగా కనిపించింది. నేడు బుధవారం ఉదయం సెన్సెక్స్ నిఫ్టీ క్షీణతతో ప్రారంభమవగా, కానీ తరువాత ఊపందుకున్నాయి.

బుధవారం ఉదయం సెన్సెక్స్ 692.27 పాయింట్లు తగ్గి 79,948.80 వద్ద ప్రారంభమవగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 146 పాయింట్లు తగ్గి 24,233.30 వద్ద ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే మార్కెట్ క్షీణతను తగ్గించుకుని కోలుకుంటూ ఊపందుకుంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 145.32 పాయింట్లు పెరిగి 80,786.39 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 కూడా 42.20 పాయింట్లు పెరిగి 24,421.80 పాయింట్ల వద్ద ఉంది.
దీనికి ముందు నిన్న మంగళవారం ట్రేడింగ్ సమయంలో భారత స్టాక్ మార్కెట్లు క్షీణతతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155.77 పాయింట్లు తగ్గి 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు తగ్గి 24,379.60 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్,పెట్రోలియం స్టాక్లలో లాభాల స్వీకరణ, భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో మంగళవారం స్థానిక స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే ఆటో మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. PSU బ్యాంక్, రియాల్టీ, ఎనర్జీ, కమోడిటీ, PSE, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
భారత మార్కెట్లపై భౌగోళిక రాజకీయ నష్టాలు పొంచి ఉన్నాయని బ్యాంకింగ్ అండ్ మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా అన్నారు. ఈరోజు బుధవారం భారతదేశ పీఓకే - పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది, ఈ కారణంగా ప్రమాదం మరింత పెరిగింది. ఉరి, బాలకోట్ దాడుల వార్తలు వచ్చినప్పుడు కూడా భారత మార్కెట్లు క్షీణతతో ప్రారంభమయ్యాయి.
రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై మార్కెట్పై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఈ దాడి నేటికే పరిమితం అవుతుందా లేదా పెరుగుతుందా అనే దానిపై మార్కెట్ భవిష్యత్తు ప్రభావం ఆధారపడి ఉంటుందని అన్నారు. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి అలాగే భారత మార్కెట్లు మరింత క్షీణతను చవిచూడవచ్చు. ప్రస్తుతం 10:30 నిమిషాలకు నిఫ్టీ50 24,340.25 వద్ద 38,85 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 80,521 వద్ద 122.27 పాయింట్లు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ ప్రారంభంలో అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ లాభాలను ఆర్జించగా, ఎల్ అండ్ టి, టెక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, టిసిఎస్ నష్టాలను చూశాయి. ప్రపంచ సంకేతాల మధ్య దాదాపు 676 కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
More From GoodReturns

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. గంటల వ్యవధిలో రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: తిరిగి పుంజుకున్న ఐటీ షేర్లు! బుల్ రన్ ఇలాగే కొనసాగుతుందా?

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications