కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారతఆర్థిక వ్యవస్థ రికవరీకి చేరువలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు, ఆర్బీఐ సరళ పరపతి సమీక్ష విధానాలు, ద్రవ్య పరపతి విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలన్నింటి వద్ద వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు సరిపడే మూలధనం ఉందన్నారు. కరోనా వైరస్ పరిస్థితి స్థిరపడ్డాక బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అంతర్గతంగా ఒత్తిడి పరిశీలన చేసుకోవాలని, మూలధన నిల్వలు పెంచుకోవాలన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్య విస్తరణ మార్గాన్ని పాటిస్తున్నామని, ఆర్బీఐ వద్ద లేని అస్త్రాలను కూడా వినియోగించామని చెప్పారు.

నిధులు సమకూర్చుకోవడం..
కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని పక్కన పెట్టి మరిన్ని నిధులు ఖర్చు చేయక తప్పలేదని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రభుత్వం ద్రవ్య విధాన లక్ష్యాలను ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయాలు రికవరీకి దోహదం చేశాయన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాయని చెప్పారు. మిగతా సంస్థలు వచ్చే కొద్ది నెలల్లో నిధులు సమకూర్చుకుంటాయని చెప్పారు. కరోనా కష్టాల నుండి ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బయట పడిందన్నారు.

బ్యాంకులకు ద్రవ్యలోటు కోసం..
వ్యవసాయం, రిటైల్, ఔషధ ఎంఎస్ఎంఈల వంటి పలు రంగాలకు ద్రవ్య లభ్యత సమకూర్చేందుకు బ్యాంకులకు రూ.లక్ష కోట్ల విలువైన ఆన్ టాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో కార్యకలాపాలను ఆర్బీఐ బుధవారం ప్రకటించింది. ఈ సదుపాయం కింద బ్యాంకులు పెట్టుబడులకు కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

వివేకవంతమైన చర్యలు
బలహీనవర్గాలకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివేకవంతమైన చర్యలను ప్రకటించిందని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా మరిన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ దిశగా ఆర్థిక శాఖ నుండి ఆదేశాలు వచ్చాయని, ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ నిన్న తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications