ఐటీ రిటర్న్ గడువు తేదీ మరో 30 రోజులు పొడిగింపు ? సీఏ నిపుణులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..

భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుదారులు తమ ITRలను సమర్పించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ లోపాలు, ITR ప్రాసెసింగ్‌లో జాప్యాలు, రీఫండ్ సమస్యలు వంటి కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు గడువు పొడిగింపును డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఈ సంవత్సరం జూలై 31, 2025 వరకు ITR దాఖలుకు గడువు ఉండగా దానిని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు ఆ గడువు మళ్ళీ దగ్గరపడింది. అందువల్ల.. కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ ITRలను దాఖలు చేయడానికి వేచి ఉన్నారు. ప్రస్తుతం అధికారిక డేటా ప్రకారం సెప్టెంబర్ 11, 2025 నాటికి మొత్తం 5.47 కోట్ల ITRలు దాఖలయ్యాయి. అయితే ఇంకా కొన్ని కోట్ల ITRలు దాఖలు కావలసి ఉంది. ఎందుకంటే గత సంవత్సరం జూలై 31, 2024 నాటికి దాదాపు 7.24 కోట్ల ITRలు దాఖలయ్యాయి.

ITR deadline extension 2025 income tax return due date 2025 ITR filing last date income tax department update ITR due date extension news ITR 2025 filing deadline ITR filing extension ITR due date delay tax filing last date 2025 ITR extension request India ITR 2025 2025 ITR ITR ITR 2025 ITR ITR ITR 2025

చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణులు, వృత్తిపరులు అనేక సాంకేతిక సమస్యల గురించి చెబుతున్నారు. ఉదాహరణకు.. సరైన బ్యాంక్ వివరాలు నమోదు చేయకపోవడం, ఫారమ్ 26AS, AIS డేటాను సరిపోలకపోవడం.. వడ్డీ ఆదాయాన్ని నమోదు చేయకపోవడం వంటి లోపాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఇలాంటి లోపాల వల్ల వాపసులు ఆలస్యం కావచ్చు. అలాగే జరిమానాలు కూడా విధించబడతాయి.

ప్రస్తుతం కొన్ని వర్గాలకు మాత్రమే సెప్టెంబర్ 15 గడువు వర్తించనప్పటికీ, చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఖచ్చితమైన గడువు తేదీని అర్థం చేసుకోలేక గందరగోళంలో ఉన్నారు. ఉదాహరణకు, ఆడిట్ అవసరమున్న ఖాతాల కోసం గడువు అక్టోబర్ 31, 2025 వరకు ఉంది. బదిలీ ధరల నివేదికలు ఉన్నవారికి నవంబర్ 30, 2025 వరకు సమయం ఉంది. పన్ను చెల్లింపుదారులకు అధికారిక ప్రకటన లేకపోవడం వలన భయాందోళనలు పెరుగుతున్నాయి.

గడువు దగ్గరపడే కొద్దీ ITR పోర్టల్ లో మరింత లోపాలు కనిపిస్తున్నాయి. ఐటి నిపుణులు చెప్పినట్టుగా సెప్టెంబర్ 15 నాటికి రోజుకు 63 లక్షల మందికి పైగా ITRలు దాఖలు చేయాలి. ఇది సాధ్యంకానిదని తెలుస్తోంది. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆదాయపు పన్ను చట్టంలో మార్చిన కొత్త నిబంధనలు ప్రకారం ITR దాఖలుకు అనేక మార్పులు వస్తున్నాయి. కొత్త చట్టం ప్రకారం ITR ఫార్మాట్‌లు మరింత సరళీకృతంగా స్పష్టంగా రూపొందించారు. అలాగే, FY 2025-26 నుండి కొత్త పన్ను నియమాలు అమల్లోకి రానున్నాయి.

చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణులు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నుండి సెప్టెంబర్ 15 గడువు పొడిగింపును ఆశిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వచ్చే వరకు, ప్రజలు త్వరగా తమ ITRలను సరిగ్గా తప్పులేకుండా దాఖలు చేయడం ఉత్తమ మార్గం అని సూచిస్తున్నారు. ఎందుకంటే గడువు దాటితే రూ.5 వేల వరకు జరిమానాతో పాటుగా అదనంగా వడ్డీ కూడా వర్తించవచ్చు. ఇప్పటి వరకు దాఖలు చేయని వారి సంఖ్య అధికంగా ఉండటంతో ITR గడువు పొడిగింపు 2025పై ఒత్తిడులు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 15కి ముందు తప్పకుండా ITRను పూర్తి చేయడం, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా చేయడం మేలని నిపుణలు భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+