Jio, Airtel: జియో, ఎయిర్టెల్కు పెరిగిన డిమాండ్.. !
2022 నవంబర్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారులను పెంచుకున్నాయి. జియో కొత్తగా 1.42 మిలియన్లు మంది యాడ్ చేసుకోగా.. ఎయిర్ టెల్ కొత్తగా 1.05 మిలియన్ల మొబైల్ వినియోగదారులను యాడ్ చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న Vodafone Idea (Vi) ప్రత్యర్థులతో సమర్థవంతంగా పోటీపడలేక పోయింది.
ట్రాయ్
Vi నవంబర్లో 1.82 మిలియన్ల మొబైల్ వినియోగదారులను కోల్పోయింది. దాని వినియోగదారుల సంఖ్యను 243.79 మిలియన్లకు తగ్గింది. దీనికి విరుద్ధంగా జియో వినియోగదారుల సంఖ్య 422.80 మిలియన్లు, ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 366.08 మిలియన్లకు పెరిగింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం కంపెనీల చందాదారుల డేటా విడుదల చేసింది.
బ్రాడ్బ్యాండ్
నవంబర్లో బ్రాడ్బ్యాండ్ లో జియో తన మార్కెట్ వాటాను పెంచుకుంది. జియో కొత్తగా 0.21 మిలియన్ల వినియోగదారులను జోడించింది. బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న BSNL మరో 3,021 మంది వినియోగదారులను కోల్పోయింది. దాని ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్యను స్వల్పంగా 7.09 మిలియన్లకు తగ్గించుకుంది. మూడవ స్థానంలో ఉన్న ఎయిర్టెల్ 0.13 మిలియన్ల వినియోగదారులను జోడించింది. దాని బ్రాడ్బ్యాండ్వినియోగదారుల సంఖ్యను 6.63 మిలియన్లకు పెంచుకుంది.
విజిటర్ లొకేషన్ రిజిస్టర్
విజిటర్ లొకేషన్ రిజిస్టర్, మొబైల్ నెట్వర్క్లో క్రియాశీల వినియోగదారుల సంఖ్యను ప్రతిబింబించే కీలకమైన మెట్రిక్, ఎయిర్టెల్ దాని వినియోగదారులలో 98.06% నెట్వర్క్లో యాక్టివ్గా ఉందని, 91.77 శాతంతో Jio, 86.02% Vi తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ట్రాయ్ డేటా ప్రకారం Vi, Airtel రెండూ గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లను కోల్పోయాయి. నవంబర్ చివరి నాటికి భారతదేశ మొబైల్ వినియోగదారుల సంఖ్య దాదాపు 1.143 బిలియన్లకు చేరుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం దాదాపు 12.02 మిలియన్ల వినియోగదారులు దరఖాస్తులు సమర్పించారు.