Anand Mahindra: మస్క్, ట్విట్టర్ కొనుగోలు రద్దుపై ఆనంద్ మహీంద్రా చమత్కార ట్వీట్..
టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు డీల్ ను రద్దు చేసుకున్నాడు.గత ఏప్రిలో 44 మిలినయ్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలును చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ మూడు నెలల సమయంలో ట్విట్టర్ కొనుగులు విషయం అనేక మలుపులు తిరిగింది. చివరికి ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ఆ సంస్థ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విటర్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు
టికెట్ లెస్ ట్రావెలర్
అయితే విషయంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు."ట్విట్టర్ టీజ్" అంటూ పోస్ట్ చేశాడు. "ఎలోన్ భారతీయ రైలులో ప్రయాణిస్తుంటే, కండక్టర్ అతనిని "TT" టికెట్ లెస్ ట్రావెలర్ అని లేబుల్ చేస్తాడు" "కానీ TT ఇప్పుడు ఏదైనా హెడ్లైన్ గ్రాబింగ్ బిడ్కి కూడా ఒక పదంగా మారవచ్చు. ఇది ట్విటర్ టీజ్." అని ట్వీట్ చేశాడు. అంటే ఎలోన్ మస్క్ రూపాయి పెట్టకుండానే ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారని పరోక్షంగా చెప్పారు.

పెనాల్టీ చెల్లించాలి
మస్క్తో చేసుకున్న ఒప్పందాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయడానికి ట్విటర్ బోర్డు కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఏదైనా కారణంగా మస్క్ ఒకవేళ లావాదేవీని పూర్తి చేయకపోతే 1 బిలియన్ డాలర్లను బ్రేక్ అప్ ఫీజు(పెనాల్టీ) కింద కట్టాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ట్విటర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి మస్క్ గతంలో ఒప్పందం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications