Investment Ideas: దేశంలో వేసవి కాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభంలోనే వేడిమి, వడగాలులతో భానుడి ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికను జారీ చేసింది. అయితే హీట్ వేవ్ గురించి వార్తలు కొన్ని షేర్లకు వరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సైతం పెరుగుతున్న ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు వాటిని తయారు చేసే కంపెనీల షేర్లు కూడా పెరుగుతాయి. బ్రోకరేజ్ సంస్థ మెహతా ఈక్విటీస్ ఈ వేసవి సీజన్లో కొనుగోలు చేయడానికి నాలుగు స్టాక్లను ఇన్వెస్టర్లకు సూచించారు. జూన్ వరకు వేసవి మంటలు కొనసాగుతాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.

సింఫనీ స్టాక్..
ముందుగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనేది కూలర్లు. వీటి తయారీలో ఇప్పటికే సింఫనీ పెద్ద పేరుగాంచింది. ఈ క్రమంలో సింఫనీ షేరు నేడు లాభంతో రూ.954.40 వద్ద ట్రేడవుతోంది. స్టాక్ కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్లలో 11% జంప్ చేసింది. సాంకేతికంగా గడచిన 2-3 ఏళ్లుగా స్టాక్ బలమైన అప్ట్రెండ్లో ఉంది. ప్రతికూల ప్రమాదం 962 వద్ద చాలా పరిమితంగా ఉందని బ్రోకరేజ్ అంచనా వేసింది. అలాగే రూ.800 సపోర్ట్ ధరగా ఉంటున్నారు. రానున్న కాలంలో షేర్ ధర రూ.1200 నుంచి రూ.1500 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది.
బజాజ్ ఎలక్ట్రికల్స్ స్టాక్..
బజాజ్ ఎలక్ట్రికల్స్ దాని వీక్లీ చార్ట్లో ట్రెండ్లైన్ సపోర్ట్ మార్క్ 900 దగ్గర ట్రేడవుతోంది. 875 నుంచి 900 జోన్ వైపు ఏదైనా కదలిక స్టాక్పై మంచి కొనుగోలు అవకాశంగా చూడాలి. ఇందులో వీక్లీ స్టాప్ లాస్ను 840 కంటే కొంచెం దిగువన ఉంచుకోవాలని సూచించింది. రానున్న కాలంలో స్టాక్ టార్గెట్ ధర రూ.1,200 చేరుకుంటుందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.
వోల్టాస్ స్టాక్..
టాటాలకు చెందిన ఏసీలు, కూలర్లు తయారు చేసే సంస్థ వోల్టాస్. వేసవిలో ప్రజలు ఎక్కువగా ఏసీలు కొనుగోలు చేసేందుకు మెుగ్గుచూపుతున్న వేళ ఈ కంపెనీ షేర్లు సైతం లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలి రెసిస్టెన్స్ మార్క్ రూ.1,139.60 వద్ద మంచి బ్రేక్అవుట్ని ఇచ్చింది. బలమైన పెరుగుదలకు సిద్ధంగా ఉన్నందున స్టాక్ ధర రానున్న కాలంలో రూ.1,356 స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ ఒక శాతం పెరిగి రూ.1,202.70 వద్ద ట్రేడవుతోంది. అలాగే గడచిన 5 రోజుల్లో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా పెరిగాయి.
బ్లూ స్టార్ స్టాక్..
దేశంలో కూలింగ్ గృహోపకరణాల తయారీ రంగంలో ఉన్న మరో కంపెనీ బ్లూస్టార్. సాంకేతికంగా స్టాక్ దాని రూ.1,220 నుంచి రూ.1,359 పరిధిలో బాగా కన్సాలిడేట్ అవుతోంది. 1250-1260 వద్ద ఏదైనా క్షీణత స్టాక్పై మంచి కొనుగోలు అవకాశమని బ్రోకరేజ్ వెల్లడించింది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.1500-1600 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లలో అప్ ట్రెండ్ ర్యాలీ కొనసాగుతుండగా నేడు స్టాక్ 1 శాతం మేర పెరిగి రూ.1,325 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గడచిన 5 రోజుల్లో స్టాక్ ధర దాదాపు 3 శాతం మేర పెరిగింది.
Note: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునేందుకు వినియోగించకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications