ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీలు తమ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని భావించడమే కాకుండా ఉగ్యోగుల్లో నైపుణ్య లేమిని కారణంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఆఫర్లు లేక వేతన జీవులు సతమతమవుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భారత్ లో ఉన్నత విద్యావంతులు ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఎటువంటి పాఠశాల విద్య లేని వారి కంటే బాగా చదువుకున్న యువకులే కొలువు విషయంలో తీవ్ర నిరుత్సాహ పడాల్సి వస్తుందంటూ కీలక నివేదిక విడుదల చేసింంది.

దేశంలో గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 29.1 శాతంగా ఉన్నట్లు ILO పేర్కొంది. సెకండరీ విద్య కలిగిన యువకుల్లో ఇది 18.4 శాతం ఉన్నట్లు తెలిపింది. అయితే చదవడం లేదా వ్రాయడం రాని వారిలో నిరుద్యోగిత రేటు కేవలం 3.4 శాతం మాత్రమే ఉన్నట్లు లెక్కగట్టింది. అంటే ఉన్నత విద్యావంతులు దాదాపు 9 రెట్లు ఎక్కువగా ప్రమాదాన్ని ఎదుర్కోనున్నట్లు స్పష్టం చేసింది.
'ఇండియా యువతలో ప్రధానంగా నిరుద్యోగం ఒక సమస్యగా ఉంది. ప్రత్యేకించి సెకండరీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విద్యను కలిగి ఉన్న యువతలో ఇది కాలక్రమేణా తీవ్రమైంది' అని ILO ఆందోళన వ్యక్తం చేసింది. శ్రామిక శక్తి నైపుణ్యాలు, మార్కెట్లోని ఉద్యోగాల మధ్య చాలా అసమతుల్యత ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పాఠశాల విద్యావ్యవస్థలో డొల్లతనం కాలక్రమేణా ఆర్థిక అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన హెచ్చరికలను ILO రిపోర్టు సమర్థించింది.
'దేశీయ యువతలో నిరుద్యోగం రేటు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కంటే ఎక్కువగా ఉంది. కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం సిద్ధమైన యువతకు వ్యవసాయేతర రంగాలలో తగిన వేతనంతో కూడిన ఉద్యోగాలను భారత ఆర్థిక వ్యవస్థ సృష్టించలేకపోయింది. పెరుగుతున్న నిరుద్యోగ రేటుకు ఇది ప్రముఖ కారణంగా తయారైంది' అని ILO పేర్కొంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications