7.34% పెరిగిన రిటైల్ ద్రవ్యోల్భణం, 8% తగ్గిన పారిశ్రామికోత్పత్తి
సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్భణం 7.34 శాతానికి పెరిగింది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం. రిటైల్ ద్రవ్యోల్భణాన్ని వినియోగ ధరల ఆధారిత సూచీ ప్రకారం లెక్కిస్తారు. ఆగస్ట్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 6.69 శాతంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 3.99 శాతంగా నమోదయింది. గత ఏడాది అక్టోబర్ నుండి రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతానికి పైగా ఉంటోంది. 2020 జనవరిలో ఏకంగా 7.59 శాతానికి పెరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్లో గరిష్ట రిటైల్ ద్రవ్యోల్భణం నమోదయింది.
పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్: మైక్రోసాఫ్ట్ బంపరాఫర్, కండిషన్ అప్లై!
ఆగస్ట్ నెలలో 9.05 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 10.68 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 20.73 శాతం పెరిగాయి. ప్రొటీన్ రిచ్ గూడ్ల ధరలు 15.47 శాతం పెరిగాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ద్రవ్యోల్భణం 2.87 శాతంగా ఉంది.
తయారీ, గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి క్షీణత మొత్తం పారిశ్రామికోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో పారిశ్రామికోత్పత్తి 8 శాతం తగ్గింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్ట్ నెలలో 1.4 శాతం క్షీణతను నమోదు చేసింది. అయితే కరోనా నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల సమయంలో నమోదైన గణాంకాలతో ఏడాది క్రితం గణాంకాలను పోల్చడం సరికాదని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీ రంగం 8.6 శాతం, గనులు 9.8 శాతం, విద్యుత్ 1.8 శాతం క్షీణించాయి.