హైదరాబాద్/అమరావతి: ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో కొత్త 57 బ్రాంచీలు తెరవనున్నట్లు గురువారం ప్రకటించింది. తద్వారా రిటైల్ నెట్ వర్క్ను విస్తరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటిని ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. రిటైల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
2019-20లో దేశవ్యాప్తంగా 450 కొత్త బ్రాంచీలను ప్రారంభించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 388 శాథలు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్లో 23 బ్రాంచీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోని 402 ఐసీఐసీఐ బ్రాంచీల్లో ఆంధ్రప్రదేశ్లో 179, తెలంగాణలో 223 ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,580 ఏటీఎం సెంటర్లు ఉన్నట్లు తెలిపింది. కర్నూలు జిల్లాలోని కరివెన, మహబూబ్నగర్ జిల్లాలోని బోయినపల్లె గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications