IT News: కరోనా అనంతరం ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని సందిగ్ధంలో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్స్ వరకు పలు సంస్థలు సిబ్బందికి ఉద్వాసన పలికి ఖర్చులు మిగుల్చుకోవాలని చూస్తున్నాయి. తాజాగా IBM ఓ కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చింది.
IBM తీసుకున్న నిర్ణయం ఇప్పుడు IT రంగంలో సంచలనంగా మారింది. భవిష్యత్తులో గొప్ప మార్పుకు ఇది నాందిగా భావిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులపై ఇష్టారీతిగా వ్యవహరించకుండా, స్వచ్ఛంద లేఆఫ్స్ దిశగా సిబ్బందిని ప్రోత్సహిస్తోంది. కంపెనీ ప్రకటించనున్న మరో రౌండ్ లే ఆఫ్స్ కు బాధితులను ఇదే పద్ధతిలో సెలక్ట్ చేస్తోంది. ఈ తొలగింపుల వల్ల యూరప్ ఉద్యోగులు ప్రభావితం అవుతారని తెలుస్తోంది.

గత నెలలో Q4 ఫలితాల సమయంలో కంపెనీ లేఆఫ్స్ ప్రకటించింది. ఇది కేవలం ఆర్థికపరమైన నిర్ణయంగానే కాకుండా వనరుల సమతుల్యతగా చూడాలని పేర్కొంది. IBM CFO జేమ్స్ కవనాగ్ మాట్లాడుతూ.. 2024 చివరి నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక సేవింగ్స్ కంపెనీ లక్ష్యమని తెలిపారు. ఈ కోతల్లో 80 శాతం ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ & సపోర్ట్ (EO&S) మరియు Q2C మిషన్లతో పాటు ఫైనాన్స్ & ఆపరేషన్స్ విభాగాల్లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దాదాపు 50 శాతం వర్క్ఫోర్స్ తగ్గింపు లక్ష్యంతో యూరప్ అంతటా పలు స్థాయిల్లో సిబ్బందిని IBM నిర్ణయం ప్రభావితం చేయనుంది. తొలగింపుల విషయంలో మొదట స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని పరిగణలోనికి తీసుకోవాలని కంపెనీ భావిస్తోంది. AI సహా హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో సిబ్బందిని సమలేఖనం చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications