హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలంటే ప్రస్తుతం ట్రైన్లో కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లు వచ్చాక ఈ సమయం 4 గంటలకు తగ్గింది. అయితే భవిష్యత్తులో ఈ దూరాన్ని కేవలం 3 గంటల్లోపే చేరుకునేలా దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక భారీ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. విమాన ప్రయాణానికి గట్టి పోటీనిచ్చేలా రైల్వే ట్రాక్లను ఆధునీకరించే పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.

ఏమిటి ఈ 'గోల్డెన్ డయాగ్నల్' అప్గ్రేడ్?
ప్రస్తుతం మన పట్టాలపై రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ, ఇప్పుడు 'గోల్డెన్ డయాగ్నల్' (Golden Diagonal) కారిడార్ లో భాగంగా ఈ వేగాన్ని 160 కిలో మీటర్లకు పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకమైన ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే.. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ-ఆగ్రా వంటి రూట్లలో మాత్రమే ఇటువంటి హైస్పీడ్ ట్రాక్ లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లైట్ జర్నీకి చెక్ పడుతుందా?
హైదరాబాద్ నుంచి విజయవాడకు(hyderabad to vijayawada) విమానంలో వెళ్లాలన్నా దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఎలాగంటే.. సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లడానికి గంట, ఫ్లైట్ జర్నీ ఒక గంట, మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విజయవాడ సిటీకి వెళ్లడానికి మరో 40 నిమిషాలు పడుతుంది. అదే రైలు వేగం గంటకు 160 కి.మీలకు పెరిగితే.. సిటీ సెంటర్ నుంచి సిటీ సెంటర్కు కేవలం 3 గంటల్లోపే చేరుకోవచ్చు. ఇది విమానం కంటే సౌకర్యవంతంగా అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణంగా మారుతుంది.
ముఖ్యమైన రూట్లు ఇవే..
ఈ స్పీడ్ అప్గ్రేడ్ కోసం దక్షిణ మధ్య రైల్వే కొన్ని కీలకమైన మార్గాలను గుర్తించింది..
- సికింద్రాబాద్ - కాజీపేట
- కాజీపేట - విజయవాడ
- విజయవాడ - దువ్వాడ
- విజయవాడ - గూడూరు
ఈ మార్గాల్లో ఇప్పటికే వందే భారత్, దురంతో, రాజధాని వంటి ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి. ట్రాక్ లను బలోపేతం చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థను మార్చడం ద్వారా ఈ స్పీడ్ ను అందుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఎప్పటికల్లా పూర్తవుతుంది?
గతంలో రైళ్ల వేగాన్ని 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 160 కి.మీ స్పీడ్ పనులకు అనుమతి లభించిన తర్వాత, సుమారు రెండేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 2,500 కిలోమీటర్ల మేర ట్రాక్లను ఆధునీకరించనున్నారు. అదే జరిగితే, హైదరాబాద్ టూ విజయవాడ (hyderabad to Vijayawada) ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.
ఏదేమైనా.. రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిత్య ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా.. రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రానుంది.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్! భాగ్యనగరంలోకి వచ్చేస్తున్న పాడ్ టాక్సీలు! వీటి ప్రత్యేకతలివే..

Gold rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు! హైదరాబాద్, బెంగళూరులో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!



Click it and Unblock the Notifications