సామాన్యుడికి నో ఎంట్రీ.. రాయదుర్గంలో ఎకరా భూమి రూ. 264 కోట్లు పైమాటే.. నగరంలో అసలేం జరుగుతోంది..

Hyderabad Real Estate: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల ఇ-వేలం రికార్డు ధరను నమోదు చేసి వ్యాపార వర్గాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన రాయదుర్గంలో ఉన్న 5.25 ఎకరాల ప్లాట్‌ను వేలం వేయగా ఏకంగా రూ. 1,386 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీజీఐఐసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ల్యాండ్ డీల్‌లో ఎకరాకు లభించిన రూ. 264 కోట్లు అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద చారిత్రాత్మక రికార్డుగా నిలిచింది.

ఈ వేలంలో డెవలపర్లు పోటీపడి బిడ్లు వేయడంతో రిజర్వ్ ధరపై 50.9 శాతం ప్రీమియం లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రారంభంలో టీజీఐఐసీ ఈ ప్లాట్‌కు ఎకరాకు రూ. 175 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా, వేలం ప్రక్రియ ముగిసే సమయానికి అది ఎకరాకు రూ. 264 కోట్లకు చేరుకుంది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల విలువ ఏ స్థాయిలో నిరంతరం పెరుగుతోందో ఈ తాజా రికార్డు స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

Hyderabad real estate Raidurg land sale Hyderabad land prices 1386 crore land deal 264 crore per acre Hyderabad property news Raidurg plot sale Hyderabad real estate boom HITEC City real estate Hyderabad commercial property Telangana real estate Hyderabad land record Hyderabad real estate Raidurg land sale Raidurg plot sold Hyderabad land prices 1 386 crore land deal 264 crore per acre Hyderabad property news Raidurg real estate

గతంలో కూడా ఈ ప్రాంతంలో భూములకు భారీ ధరలు పలికాయి. గత మే నెలలో టీజీఐఐసీ ఇక్కడే నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ. 237 కోట్లు లభించగా.. తాజా లావాదేవీ ఆ పాత రికార్డును ఎకరాకు రూ.27 కోట్లు అధిగమించడం గమనార్హం. అలాగే గత ఏడాది అక్టోబరులో రైదుర్గ్‌లోని 7.67 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయగా ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున రూ. 1,358 కోట్లు వచ్చాయి. వరుసగా జరుగుతున్న ఈ భూముల అమ్మకాలు హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపార జిల్లాలో భూమికి రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుండి ఉన్న నిరంతర డిమాండ్‌ను ధృవీకరిస్తున్నాయి.

Also Read

MSTC ఇ-వేలం ప్లాట్‌ఫారమ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించబడిన ఈ ప్రక్రియకు ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ సంస్థ JLL ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది. దేశంలోని ప్రధాన సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు.. హై-గ్రౌత్ డెవలప్‌మెంట్‌కు తెలంగాణ అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా నిలుస్తోందని ఈ ఫలితం నిరూపించింది.

ఈ వేలం విజయంపై టీజీఐఐసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి కె. శశాంక సంతోషం వ్యక్తం చేశారు. ప్లాట్ల వేలం విజయవంతంగా ముగియడం అనేది తెలంగాణ భవిష్యత్తు, ఆర్థిక పురోగతిపై డెవలపర్ వర్గానికి ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం వేలంలో లభించిన అధిక ధర మాత్రమే కాదని, పారదర్శకత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భాగస్వాములందరికీ నిజమైన విలువను సృష్టించడం వంటి అంశాలపై ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు లభించిన స్పష్టమైన గుర్తింపు అని పేర్కొన్నారు.

రాయదుర్గం ప్రాంతం నగర ఐటీ కారిడార్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో పాటు.. హైటెక్ సిటీకి అద్భుతమైన నిరాటంక కనెక్టివిటీ కలిగి ఉండటమే ఈ స్థాయిలో పోటీ ఏర్పడటానికి ప్రధాన కారణమని అధికారులు వివరించారు. ఈ ప్రదేశం ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక ప్రముఖ బెంచ్‌మార్క్ రియల్ ఎస్టేట్‌గా మారిందని.. హైదరాబాద్ గ్లోబల్ స్థాయి వ్యాపార కేంద్రంగా ఎదగడాన్ని ఈ ల్యాండ్ సేల్ మరోసారి చాటిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+