Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి వాన కురుస్తోంది. సాయంత్రం 5-.30 గంటలకు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వాన ఆ తర్వాత అంతటా దంచికొట్టింది.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నడుంలోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గచ్చిబౌలిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ విపరీతంగా స్థంభించిపోయింది. కొద్ది గంటల్లోనే గచ్చిబౌలిలో 12.35 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఐటీ హబ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కిలోమీటర్ల పొడవున వాహనాల ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. ఐటీ ఉద్యోగులతో పాటుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కీలక జంక్షన్లలో నీటి ముంపు కారణంగా వాహనదారులు చిక్కుకుపోయారు.
సాయంత్రం పని ముగించుకొని ఇంటి బాట పట్టిన ఉద్యోగులు ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. సాధారణంగా 20-25 నిమిషాల్లో పూర్తయ్యే బంజారాహిల్స్-మణికొండ ప్రయాణం ఈసారి రెండు గంటలకుపైగా సాగింది. పలు మార్గాలు మూసుకుపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.చిత్రపురి కాలనీ, లాంకో హిల్స్ వంటి అనేక నివాస ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారులు నీటితో నిండిపోయాయి. కొన్ని కాలనీల ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి పొడవైన మార్గాలు తిరగాల్సి వచ్చింది. కొందరు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా విభాగాలు తక్షణ చర్యలకు దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దులాపూర్మెట్, నాగోల్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్నగర్, మీర్పేట్లలో మోస్తరు నుండి భారీ వర్షం పడింది.
పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాదు వంటి కేంద్ర ప్రాంతాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఐటీ హబ్లలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ మరియు టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరుద్ఘాటించారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. హుస్సేన్ సాగర్లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్నగర్, సబర్మతినగర్ ప్రాంతాల్లోనూ వరద ముప్పు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరవాసులు తమ ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.ఎల్లో హెచ్చరిక 15వ తేదీ వరకూ ఉంటుందని తెలిపింది.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications