అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్స్, మెసేజెస్, మెయిల్స్ ద్వారా ఇప్పటివరకు నగదు తస్కరించడం రోజూ వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్ లో తాజాగా ఓ కొత్త తరహా మోసం బయటకు వచ్చింది. ఈ ముఠా ఏకంగా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించడం విశేషం.
హైదరాబాద్ లో ఓ ఘరానా మోసాన్ని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ, ఓ ముఠా నగరంలో ఫేక్ కాల్ సెంటర్ నడిపిస్తోంది. ఈ అంతర్జాతీయ కాల్ సెంటర్ ద్వారా అమెరికా పౌరులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 115 మంది సైబర్ నేరగాళ్లు ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు తెలిపారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాల్స్ ద్వారా అమెరికన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఆన్ లైన్ పోర్టల్స్ నుంచి అమాయకులు ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి మోసాలకు పాల్పడినట్లు వివరించారు.
లా ఎన్ఫోర్స్మెంట్ ప్రకారం.. కాల్ సెంటర్ సిబ్బంది VoIPని ఉపయోగించి అమెరికన్లకు కాల్స్ చేసేవారు. వారికి సంబంధించిన ప్యాకేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు భయపెట్టేవారు. US కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని బెదిరించేవారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే గిఫ్ట్ కార్డుల ద్వారా నగదు చెల్లించాలని చెప్పేవారు.
గిఫ్ట్ కార్డులను ఇండియాలో రిడీమ్ చేసి, ఆ అమౌంట్ ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలకు బదిలీ చేసేవారు. అనంతరం లోకల్ బిట్ కాయిన్ డీలర్స్ కు విక్రయించి నిధులను తమ ఖాతాకు బదిలీ చేసుకునేవారు. ఈ చెల్లింపులన్నీ US డాలర్స్ లో జరగడంతో స్కామ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు నిందితుల పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications