అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్స్, మెసేజెస్, మెయిల్స్ ద్వారా ఇప్పటివరకు నగదు తస్కరించడం రోజూ వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్ లో తాజాగా ఓ కొత్త తరహా మోసం బయటకు వచ్చింది. ఈ ముఠా ఏకంగా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించడం విశేషం.
హైదరాబాద్ లో ఓ ఘరానా మోసాన్ని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ, ఓ ముఠా నగరంలో ఫేక్ కాల్ సెంటర్ నడిపిస్తోంది. ఈ అంతర్జాతీయ కాల్ సెంటర్ ద్వారా అమెరికా పౌరులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 115 మంది సైబర్ నేరగాళ్లు ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు తెలిపారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాల్స్ ద్వారా అమెరికన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఆన్ లైన్ పోర్టల్స్ నుంచి అమాయకులు ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి మోసాలకు పాల్పడినట్లు వివరించారు.
లా ఎన్ఫోర్స్మెంట్ ప్రకారం.. కాల్ సెంటర్ సిబ్బంది VoIPని ఉపయోగించి అమెరికన్లకు కాల్స్ చేసేవారు. వారికి సంబంధించిన ప్యాకేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు భయపెట్టేవారు. US కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని బెదిరించేవారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే గిఫ్ట్ కార్డుల ద్వారా నగదు చెల్లించాలని చెప్పేవారు.
గిఫ్ట్ కార్డులను ఇండియాలో రిడీమ్ చేసి, ఆ అమౌంట్ ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలకు బదిలీ చేసేవారు. అనంతరం లోకల్ బిట్ కాయిన్ డీలర్స్ కు విక్రయించి నిధులను తమ ఖాతాకు బదిలీ చేసుకునేవారు. ఈ చెల్లింపులన్నీ US డాలర్స్ లో జరగడంతో స్కామ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు నిందితుల పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications