Hyderabad Realty: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంది. ఆయా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మెట్రో సిటీల్లో అయితే కోట్లు పెట్టినా జాగా దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇటీవల ఎకరం 100 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. దీంతో భాగ్యనగరంలో రియల్ బూమ్ ఏ స్థాయిలో ఉందో యావత్ దేశానికి అర్ధమైంది.
గతంతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పుడు విలాసవంతమైన, ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 2023లో 5 వేల 725 ఆస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. ఒక్క ఫిబ్రవరి, 2024లోనే 6 వేల 938 చేతులు మారాయి. అంటే 21 శాతం భారీ పెరుగుదల నమోదైంది. వీటి విలువ దాదాపు 4 వేల 247 కోట్లుగా తేలింది. ఏడాది క్రితం 2 వేల 987 కోట్లతో పోలిస్తే ఇది 42 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

భాగ్యనగరం రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలు అంతర్భాగంగా ఉన్నాయి. గత నెల హైదరాబాద్లో అమ్ముడైన ఆస్తుల్లో 25-50 లక్షల శ్రేణి ప్రోపర్టీస్ వాటా 45 శాతంగా ఉంది. ఇక్కడ రిజిస్టర్ కాబడిన ఆస్తుల కేటగిరిలో ఇదే అతి పెద్దదిగా నిలిచింది. 25 లక్షల కంటే తక్కువ వాల్యూ రిజిస్ట్రేషన్స్ 14 శాతం, కోటి పైగా విలువైనవి 10 శాతం చొప్పున నమోదయ్యాయి.
రిజిస్టర్ కాబడిన చాలా ఆస్తులు వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఫిబ్రవరి 2023తో పోలిస్తే చిన్న గృహాలకు డిమాండ్ 20 నుంచి 16 శాతానికి పడిపోయింది. ఈ మొత్తం డేటా ప్రకారం చూస్తే హైదరాబాద్లో ప్రీమియం గృహాలకు డిమాండ్ బాగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా MD శిశిర్ బైజల్ తెలిపారు. కోవిడ్ అనంతరం ధరలు స్థిరంగా పెరిగినట్లు వెల్లడించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications