భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలో ఒక చోట నుండి మరో చోటికి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ (MMTS), మెట్రో రైలు , ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేస్తూ 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నగరవాసులకు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మెట్రో - ఎంఎంటీఎస్ మధ్య స్కైవాక్లు
ప్రస్తుతం మెట్రో దిగి ఎంఎంటీఎస్ స్టేషన్ కు వెళ్లాలన్నా, లేదా బస్సు స్టాప్ కు చేరుకోవాలన్నా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ దాటాల్సి వస్తోంది. దీనిని నివారించేందుకు ప్రధాన ప్రాంతాల్లో స్కైవాక్లను (Skywalks) నిర్మించనున్నారు. తద్వారా ప్రయాణికులు రోడ్డు మీదకు రాకుండానే నేరుగా ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్లోకి ప్రవేశించవచ్చు.
యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) చేసిన అధ్యయనం ప్రకారం.. సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, భరత్ నగర్, మలక్ పేట , ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో మెట్రో , ఎంఎంటీఎస్ స్టేషన్లు దగ్గరగానే ఉన్నా, సరైన కనెక్టివిటీ లేదు. త్వరలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ , బస్సు స్టాప్లను కలుపుతూ ఆధునిక స్కైవాక్ పనులు ప్రారంభం కానున్నాయి.
స్టేషన్ల వద్దకే బస్సు స్టాప్లు
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేవలం 21 స్టేషన్లు మాత్రమే బస్సు స్టాప్లకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 30 స్టేషన్లు బస్సు స్టాప్లకు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపడం లేదు. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది..
- బస్సు స్టాప్ల మార్పు: సాధ్యమైన చోట బస్సు స్టాప్లను ఎంఎంటీఎస్ స్టేషన్ల ముఖద్వారాల వద్దకు మారుస్తారు.
- బ్యాటరీ వాహనాలు: బస్సు స్టాప్లు మార్చడం కుదరని చోట, స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు ప్రయాణికులను చేరవేసేందుకు నామమాత్రపు ధరతో బ్యాటరీ వాహనాలను (EVs) ఏర్పాటు చేస్తారు.
గణాంకాలు ఒకసారి చూస్తే..
నగరంలో ప్రజా రవాణా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నా, సొంత వాహనాల వాడకం తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న రవాణా వివరాలు ఇవే..
- ఆర్టీసీ బస్సులు: 25 లక్షల మంది (ప్రతిరోజూ)
- మెట్రో రైలు: 5 లక్షల మంది
- ఎంఎంటీఎస్: 40,000 - 50,000 మంది
- సొంత వాహనాలు: దాదాపు 70 లక్షలు
భవిష్యత్తు ప్రణాళికలు
రెండవ విడత ఎంఎంటీఎస్ పనులు పూర్తయితే నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, ఉందానగర్ , శంకర్ పల్లి వరకు ఈ సేవలు విస్తరిస్తాయి. దీనికి తోడు మెట్రో రెండో దశ విస్తరణ పూర్తయితే.. హైదరాబాద్ (Hyderabad) రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో మారుతుంది. ట్రాఫిక్ లేని ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు సక్సెస్ అయితే, నగరంలో కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణికులు ఒక్కసారి టికెట్ తీసుకుంటే బస్సు, మెట్రో లేదా ఎంఎంటీఎస్ దేనిలోనైనా ప్రయాణించేలా 'కామన్ మొబిలిటీ కార్డ్' (Common Mobility Card) విధానాన్ని కూడా వేగవంతం చేస్తున్నారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications