హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టును నిర్వహించే లార్సెన్ & టూబ్రో (L&T) కంపెనీ.. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి లేఖ రాసింది. L&T కంపెనీ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టులో నష్టాలు రూ.6,000 నుంచి రూ.6,600 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నష్టానికి ప్రధాన కారణాలు ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులు పెరగడం, పెద్ద రుణభారం. ఇంకా COVID-19 కారణంగా ఐదు నెలల పాటు Hyderabad Metro సేవలు నిలిపివేయడంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
L&T తన భాగస్వామ్య హక్కులను తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం తమ వాటా ప్రభుత్వానికి ఇచ్చి, ప్రాజెక్టు నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోకి రావాలని కోరుతోంది. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్ కింద ఈ మెట్రో ప్రాజెక్టు పనిచేస్తోంది. అయితే, ఈ మోడల్ కారణంగా భవిష్యత్తులో కొత్త మెట్రో లైన్లను కలపడం, టికెట్ ధరలు, ఆదాయం, ఖర్చులు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.

L&T ఒక పరిష్కారాన్ని కూడా ప్రతిపాదించింది. కొత్త స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు చేయడం. ఇందులో తన ఈక్విటీ వాటాను విక్రయించి, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం పూర్తిగా ఉండేలా చేయాలని సూచించింది. ఇది భవిష్యత్తులో మెట్రో సేవలు సజావుగా, సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుందని కోరింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 10 శాతం వాటాను కలిగి ఉంది, కానీ ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనపై అధికారిక స్పందన లేదు.
ఇప్పటివరకు.. గత సంవత్సరం (2024 ఆగస్టులో), రోజు సగటున 5.63 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించేవారు. ఇప్పుడు, ఈ సంఖ్య కాస్త తగ్గి సుమారు 4.75 లక్షల మంది ప్రయాణికులు రోజుకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవు కలిగిన రెడ్, గ్రీన్, బ్లూ లైన్లపై మెట్రో రైళ్లు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై పెద్దగా ప్రశ్నార్థకతను తీసుకువచ్చింది. ఇకపై ప్రాజెక్టు ఎలా కొనసాగించాలి, ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే లార్సెన్ & టూబ్రో (L&T) ప్రస్తుతం పెద్ద ఎత్తున రెండు కీలకమైన ఆర్డర్లు పొందింది. వీటిలో ఒకటి తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఇది ప్రత్యేకంగా ఇంజనీరింగ్, నిర్మాణం, సహాయక పరికరాల సరఫరా కోసం L&Tకి లభించిన ఆర్డర్. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ ఆర్డర్ కింద L&T అణు రియాక్టర్ మరియు టర్బైన్ వ్యవస్థలకు సంబంధించిన కీలక పరికరాలను సరఫరా చేస్తుంది. ఇందులో ప్రధానంగా జనరేటర్లు, కండెన్సర్లు, సముద్రపు నీటి వ్యవస్థలు, ధ్రువ క్రేన్లు, ట్రెస్టల్ క్రేన్లు, పైపింగ్, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్, పూత, ఇన్సులేషన్ వంటి పరికరాలు ఉంటాయి.
ఈ ఆర్డర్ను గెలుచుకున్న రోజు తర్వాత L&Tకి మరో భారీ ఆర్డర్ వచ్చింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) నుండి ముంబై-అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం 156 కిలోమీటర్ల హై-స్పీడ్ బ్యాలస్ట్లెస్ ట్రాక్ నిర్మాణం ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ భారతదేశంలో అతి పెద్ద హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఒకటిగా పేర్కొనబడుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications