హైదరాబాద్ మెట్రో రైలును నడపలేం .. పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయామని తెలిపిన L&T

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టును నిర్వహించే లార్సెన్ & టూబ్రో (L&T) కంపెనీ.. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి లేఖ రాసింది. L&T కంపెనీ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టులో నష్టాలు రూ.6,000 నుంచి రూ.6,600 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నష్టానికి ప్రధాన కారణాలు ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులు పెరగడం, పెద్ద రుణభారం. ఇంకా COVID-19 కారణంగా ఐదు నెలల పాటు Hyderabad Metro సేవలు నిలిపివేయడంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

L&T తన భాగస్వామ్య హక్కులను తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం తమ వాటా ప్రభుత్వానికి ఇచ్చి, ప్రాజెక్టు నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోకి రావాలని కోరుతోంది. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్ కింద ఈ మెట్రో ప్రాజెక్టు పనిచేస్తోంది. అయితే, ఈ మోడల్ కారణంగా భవిష్యత్తులో కొత్త మెట్రో లైన్‌లను కలపడం, టికెట్ ధరలు, ఆదాయం, ఖర్చులు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.

Hyderabad Metro Rail L amp amp T exit Hyderabad Metro crisis metro rail project trouble infrastructure project delay L amp amp T Hyderabad metro rail issues Hyderabad infrastructure news L amp amp T withdraw metro rail development Hyderabad public transport L amp amp T controversy L amp amp T L amp amp T L amp amp T L amp amp T

L&T ఒక పరిష్కారాన్ని కూడా ప్రతిపాదించింది. కొత్త స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు చేయడం. ఇందులో తన ఈక్విటీ వాటాను విక్రయించి, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం పూర్తిగా ఉండేలా చేయాలని సూచించింది. ఇది భవిష్యత్తులో మెట్రో సేవలు సజావుగా, సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుందని కోరింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 10 శాతం వాటాను కలిగి ఉంది, కానీ ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనపై అధికారిక స్పందన లేదు.

ఇప్పటివరకు.. గత సంవత్సరం (2024 ఆగస్టులో), రోజు సగటున 5.63 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించేవారు. ఇప్పుడు, ఈ సంఖ్య కాస్త తగ్గి సుమారు 4.75 లక్షల మంది ప్రయాణికులు రోజుకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవు కలిగిన రెడ్, గ్రీన్, బ్లూ లైన్లపై మెట్రో రైళ్లు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితి హైద‌రాబాద్ మెట్రో భవిష్యత్తుపై పెద్దగా ప్రశ్నార్థకతను తీసుకువచ్చింది. ఇకపై ప్రాజెక్టు ఎలా కొనసాగించాలి, ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే లార్సెన్ & టూబ్రో (L&T) ప్రస్తుతం పెద్ద ఎత్తున రెండు కీలకమైన ఆర్డర్లు పొందింది. వీటిలో ఒకటి తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఇది ప్రత్యేకంగా ఇంజనీరింగ్, నిర్మాణం, సహాయక పరికరాల సరఫరా కోసం L&Tకి లభించిన ఆర్డర్. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.

ఈ ఆర్డర్ కింద L&T అణు రియాక్టర్ మరియు టర్బైన్ వ్యవస్థలకు సంబంధించిన కీలక పరికరాలను సరఫరా చేస్తుంది. ఇందులో ప్రధానంగా జనరేటర్‌లు, కండెన్సర్లు, సముద్రపు నీటి వ్యవస్థలు, ధ్రువ క్రేన్‌లు, ట్రెస్టల్ క్రేన్‌లు, పైపింగ్, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్, పూత, ఇన్సులేషన్ వంటి పరికరాలు ఉంటాయి.

ఈ ఆర్డర్‌ను గెలుచుకున్న రోజు తర్వాత L&Tకి మరో భారీ ఆర్డర్ వచ్చింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) నుండి ముంబై-అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం 156 కిలోమీటర్ల హై-స్పీడ్ బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ నిర్మాణం ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ భారతదేశంలో అతి పెద్ద హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఒకటిగా పేర్కొనబడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+