హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఐటీ కారిడార్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పీక్ స్టేజీకి చేరిన సంగతి విదితమే.నగరంలో ఫ్లాట్ కొనాలన్నా దొరకని పరిస్థితి. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో భూమి దొరకడం చాలా కష్టం.అయితే అలాంటి చోట భూమి డంపింగ్ యార్డ్ గా మారింది. దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే భూమిని చెత్తకు కేంద్రంగా మార్చారు. అక్కడ పేరుకుపోయిన చెత్త ఏకంగా పక్కన ఉన్న భవనాల అంత ఎత్తుకు చేరిందంటే అక్కడ ఎంత చెత్త పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు..

TOI కథనం ప్రకారం.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ఐకియా, డెలాయిట్ వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థల సమీపంలో ఉన్న 10 ఎకరాల విలువైన భూమి సుమారు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న తీవ్రమైన న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 2006 నుంచి ఈ న్యాయపోరాటం నడుస్తోంది. 2006లో ఎకరాకు కేవలం రూ. 50 లక్షలుగా ఉన్న ఈ భూమి విలువ.. ప్రస్తుతం ఐటీ రంగంలో పెరిగిన విపరీతమైన డిమాండ్ కారణంగా 400 రెట్లు పెరిగి.. ఎకరాకు రూ. 200 కోట్లకు పైగా పలుకుతోంది. దీనితో ఈ 10 ఎకరాల భూభాగం మొత్తం విలువ రూ. 2,000 కోట్లకు పైగా పెరిగినప్పటికీ.. పరిష్కారం కాని వివాదం వల్ల ఖరీదైన భూమి నేడు బీడు భూమిగా మారిపోయింది.

Hyderabad Land Dispute 2000 Crore Land Hyderabad IT Hub Hyderabad Real Estate Land Dispute Prime Land Hyderabad Telangana Real Estate Property Dispute Hyderabad Property News IT Corridor Hyderabad Real Estate News Land Case Hyderabad News 2000

Prime Hyderabad Land Worth ₹2,000 Crore Turns Into a Dumping Ground Amid Legal Battle (Photo Credit: Times of India)

యజమానుల పర్యవేక్షణ లేకపోవడం, భూమి ఖాళీగా ఉండటంతో, ఐటీ కారిడార్‌లోని నిర్మాణ రంగానికి చెందిన బిల్డర్లు, డెవలపర్లు ఈ స్థలాన్ని అక్రమ నిర్మాణ, కూల్చివేత (C&D) వ్యర్థాలను పారవేసే ప్రదేశంగా మార్చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నివేదికల ప్రకారం మార్చి 2016 నుండి ఇక్కడ అనధికారికంగా వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. ఏళ్లుగా వేలాది టన్నుల వ్యర్థాలు వచ్చి చేరడంతో.. ఇది నగరంలోనే అతిపెద్ద అక్రమ డంప్‌సైట్‌గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 15 లక్షల టన్నుల శిథిలాలు పేరుకుపోగా.. ఆ చెత్త కుప్పలు పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనాల ఎత్తుకు పెరిగి అసలు భూభాగాన్ని పూర్తిగా కాంక్రీటు, ఇటుకల కింద కప్పివేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎంసీ ఆవిర్భవించిన తర్వాతే ఈ అక్రమ డంపింగ్‌పై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి.

Also Read

ఈ పాత వారసత్వ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి స్థలాన్ని శుద్ధి చేయడం అధికారులు, ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక సవాలుగా మారింది. ప్రైవేట్ C&D వ్యర్థాల శుద్ధి కేంద్రాలు రవాణా, రీసైక్లింగ్ కోసం టన్నుకు రూ. 400 నుండి రూ. 450 వరకు వసూలు చేస్తుండటంతో.. మొత్తం 15 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించడానికి రూ. 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలో గనుల శాఖ ప్రాథమికంగా రూ. 20 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నప్పటికీ.. అవసరమైన సాంకేతికత, లాజిస్టిక్స్ ఆధారంగా ప్రైవేట్ ఏజెన్సీలు అధిక కొటేషన్లు ఇచ్చాయి.

ఈ తీవ్రమైన సమస్య పరిష్కారానికి సీఎంసీ చర్యలు వేగవంతం చేసింది. ఐకియా, డెలాయిట్ సమీపంలోని ఈ డంప్‌సైట్‌ను శాస్త్రీయంగా పునరుద్ధరించడానికి, తగిన ప్రణాళికలు, సాంకేతిక పరిష్కారాలను అందించాల్సిందిగా పలు ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎంపికైన ఏజెన్సీ వ్యర్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్, పునర్వినియోగం, మొబైల్ లేదా స్థిర ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు, రవాణా ప్రాసెస్, తొలగింపు సమయంలో దుమ్ము, లీచేట్ కాలుష్యం వ్యాపించకుండా నియంత్రణ చర్యలను సూచించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+