Hyderabad IPO Scam : హైదరాబాద్ నగరంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అమాయకులను ఎరగా వేసి కోట్ల రూపాయలు పిండుకున్నారు. రెండు భారీ ఆన్లైన్ పెట్టుబడి మోసాలు వెలుగులోకి రాగా.. ఇద్దరూ కలిపి రూ. 2.52 కోట్లు పోగొట్టుకున్నారు.మోసపోయామని తెలుసుకుని గుండెలు బాదుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లోని నిజాంపేటకు చెందిన మహిళ ఒక ఆన్లైన్ పెట్టుబడి మోసానికి గురై రూ.1.52 కోట్లను కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే మరో కేసులో.. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ను రూ.1 కోటి మోసగాళ్లు మోసపూరిత వెబ్సైట్ ద్వారా వంచించారు. ఈ రెండు ఘటనలు సైబర్ మోసాల పెరుగుతున్న ముప్పును మరోసారి చూపిస్తున్నాయి.
మొదటి ఘటన వివరాల్లోకెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన 45 ఏళ్ల గృహిణి.. ఒక నకిలీ పెట్టుబడి యాప్ మరియు మోసపూరిత వాట్సాప్ గ్రూప్ కారణంగా రూ.1.52 కోట్లను కోల్పోయింది. మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ అయిన ఈ మహిళ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలని భావించింది. కొద్ది రోజుల క్రితం ఆమెను హ్యాకర్లు ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ గ్రూప్ పేరు, రూపకల్పన. ఆ గ్రూప్లో అప్పర్ సర్క్యూట్ స్టాక్లు, SME/మెయిన్బోర్డ్ IPOలు, మ్యూచువల్ ఫండ్ల వంటి పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రొఫెషనల్లా నటించే అడ్మిన్లు, పెద్ద లాభాలు వస్తాయని హామీ ఇస్తూ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందారు.ఈ మహిళ కూడా ఆ మాటలు నమ్మింది.

గ్రూప్లో షేర్ చేయబడిన ఒక లింక్ ద్వారా మహిళ ఒక ఆన్లైన్ ఖాతా తెరిచి మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది. ప్రారంభంలోనే ఆమెకు పెద్ద మొత్తంలో నకిలీ షేర్లు కేటాయించారు. ఆన్లైన్ డాష్బోర్డ్లో లాభాలు పెరుగుతున్నట్లు చూపించడంతో.. ఆమె మరింత నమ్మకం పెరిగింది. దీంతో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. కొన్ని వారాల్లోనే పెట్టుబడి మొత్తం లక్షల రూపాయలకు పెరిగింది.
లాభాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలని ఆమె ప్రయత్నించగా..అడ్మిన్లు 10 శాతం సేవా రుసుము చెల్లించాల్సిందిగా తెలిపారు. సేవా రుసుము చెల్లించిన తరువాత కూడా డబ్బు రాకపోవడంతో.. మీ ఖాతా నంబర్లో సాంకేతిక లోపం ఉందంటూ సాకు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మళ్లీ చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు. ఇలా జూన్ 6 నుండి జూలై 31 వరకు ఆమె మొత్తం రూ. 1.52 కోట్లను పలు విడతలుగా బదిలీ చేసింది. చివరికి డబ్బు తిరిగి రాకపోవడంతో ఆమెకు అనుమానం మొదలైంది.
ఆ గ్రూప్ నిజానికి ప్రసిద్ధ పెట్టుబడి సంస్థ ఆనంద్ రతి ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ లా నటిస్తున్న మోసగాళ్ల గుంపు అని ఆమె గ్రహించింది. వారు ఉపయోగించిన మొబైల్ యాప్ కూడా పూర్తిగా నకిలీ అని తెలుసుకుంది. పెట్టుబడులు పెట్టమని ఆ యాప్ ద్వారా మోసం చేసినట్లు అర్థమైంది.దీంతో ఆ మహిళ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 318(4), 319(2), 336(3), 338, 340(2) r/w 3(5) BNS మరియు 66-D కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
మరో కేసులో.. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ను మోసగాళ్లు మోసపూరిత స్టాక్ ట్రేడింగ్ వెబ్సైట్లోకి లాగి భారీగా వంచించారు. మొదట అతను రూ. 10 వేలు పెట్టుబడి పెట్టగా, డాష్బోర్డ్లో లాభాలు చూపించడంతో మరిన్ని నిధులు జోడించాడు. కొద్ది వారాల్లో పెట్టుబడి మొత్తం రూ.1 కోటికి చేరింది. అతను డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, స్కామర్లు "ఉపసంహరణ క్లియరెన్స్ ఫీజు" పేరుతో మరిన్ని చెల్లింపులు కోరారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించాడు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయంపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, ధృవీకరించని లేదా గుర్తింపు లేని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. ముఖ్యంగా వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications