Hyderabad News: తెలంగాణ ప్రస్తుతం ప్రపంచ ఐటీ సేవల రంగంలో భారీగా వ్యాపారాన్ని సంపాదిస్తోంది. ఒకప్పుడు బెంగళూరులో ఆఫీసులు పెట్టిన కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ చెక్కేస్తున్నాయి. అధికంగా వరదలు, నీటి కొరత, ట్రాఫిక్ కష్టాలు, భారీగా పెరిగిన అద్దెలు వంటి అనేక సమస్యల సుడిగుండంలో బెంగళూరు చిక్కుకోవటం హైదరాబాదుకు భారీగా కలిసొస్తోంది.
అయితే వేగంగా వ్యాపారాన్ని ఆకర్షిస్తున్న స్థాయిలో అందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అదే స్థాయిలో అభివృద్ధి చెందటం లేదని కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తోంది. ఉపాధి అవకాశాల కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో రాకపోకలు పెరిగి ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ట్రాఫిక్ రద్దీని నియంత్రించటానికి చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమితో హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, ఇతర రోడ్ల నిర్మాణం నెమ్మదిగా సాగటం ప్రయాణికులకు కష్టాలను కొనసాగిస్తూనే ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నిధుల కొరతతో దాదాపు 6 ఫ్లైఓవర్ల నిర్మాణం ఆలస్యమవుతోందని వెల్లడైంది.

ఈ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు హైదరాబాద్ కార్పొరేషన్కు రూ.200 కోట్లు అవసరమని తెలుస్తోంది. ముఖ్యంగా శిల్పా లేఅవుట్, కాచిమౌళి జాయింట్ రోడ్డు, నల్కొండ రోడ్డు, ఆరామగఢ్ వైల్డ్ లైఫ్ పార్క్, ఉప్పల్ జాయింట్ రోడ్డులో ఫ్లైఓవర్లు నిర్మించేందుకు గుంతలు తవ్వగా, మరికొన్ని చోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే రద్దీగా ఉన్న రోట్లు మరింత ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్స్ పెరిగాయి.
హైదరాబాద్ నగరంలో 42 రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు సిఫార్సు చేయగా అందులో 36 పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. 36 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హైదరాబాద్ కార్పొరేషన్ ఇప్పటికే బ్యాంకు రుణాలు, బాండ్ల ద్వారా నిధులు సేకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అప్పుల చెల్లింపులకే ఇబ్బందిపడుతున్న జీహెచ్ఎమ్సీ కొత్తగా మరిన్ని అప్పులు చేసే పరిస్థితులు కనిపించటం లేదని తెలుస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన 6 ఫ్లైఓవర్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు లేవని తెలుస్తోంది. కాగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిగా ఎలాంటి వ్యూహాలతో నిధులను కార్పొరేషన్ సమీకరిస్తుందనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతోంది. ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం కారణంగా పనులు జరుగుతున్న రోడ్లపై ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
ఉదాహరణకు చంచల్గూడ జైలు నుంచి ఒవైసీ జంక్షన్ వరకు, చంపాపేట్ వైపు ఉన్న రహదారి గుంతలతో నిండిపోయాయి. పైగా ప్రస్తుతం పడుతున్న వర్షాలతో ఇవి రోడ్లపై ప్రయాణాన్ని క్లిష్టతరంగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు బెంగళూరు తరహా ఇబ్బందులు కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నగర అభివృద్ధితో పాటు హైదరాబాదుకు వ్యాపార ఆకర్షణను తగ్గిస్తుందని వారు అంటున్నారు. రియల్టీ సైతం దెబ్బతింటుందని డెవలపర్లు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications