Hyderabad Economy: ఒకప్పుడు కేవలం కొండలు గుట్టలుగా ఉన్న హైదరాబాద్ కాలక్రమంలో భారీ అభివృద్ధితో విస్తరించిన సంగతి తెలిసిందే. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో అంటూ అనేక రంగాలకు చెందిన కంపెనీల ఏర్పాటు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న మరో కీలక అభివృద్ధి భాగ్యనగరానికి భారీగా కాసుల వర్షం కురిపించటానికి సిద్ధంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని రెండు అర్బన్ నోడ్లు రాష్ట్రంలో మెరుగైన రవాణా అప్గ్రేడ్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి వరంగల్, హసన్పర్తి వరకు 62 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనికి సుమారు రూ.1116 కోట్లు ఖర్చు కానుంది. ఈ చొరవ వల్ల హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల రాకపోకలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధానిలో వ్యాపారాన్ని పెంచుతుందని, ఇది హైదరాబాద్ ఎకానమీకి దోహదపడుతుందని తెలుస్తోంది.

రెండు నగరాల మధ్య రైల్వే లైన్ను ఏర్పాటు కేవలం పర్యాటక రంగానికే కాకుండా.. వ్యాపార, వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు సానుకూల వృద్ధిని అందించనుంది. నగరానికి వచ్చే ప్రయాణికుల రద్దీ పెరగటం వల్ల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కొత్త రైల్వే లైన్ బాగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. లైన్ మానకొండూర్, హుజూరాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలను హైదరాబాద్తో కలుపుతుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, కాచిగూడకు నడిచే కొన్ని డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రైళ్లను సులభతరం చేస్తుంది
కరీంనగర్-హసన్పర్తి లైన్, ఉప్పల్ స్టేషన్ అప్గ్రేడేషన్ కోసం కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించటంతో హైదరాబాద్ ఎకానమీ అనేకరెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకినాడ ఓడరేవు ద్వారా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గ్రానైట్ పరిశ్రమకు ఈ లైన్ తోడ్పాటును అందిస్తుందని ఒక సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications