Internet shutdown: భోజనం లేకుండా మనిషి బతకొచ్చేమో కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇంటర్ నెట్ లేనిదే క్షణం గడవడం లేదు. అదే కొంత కాలం పాటు పూర్తిగా అంతర్జాల సేవలు ఆపేస్తే.. తలచుకోవడానికే భయమేస్తోంది కదూ..! కానీ ఒక్క మన దేశంలోనే 2022లో 34 సార్లు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారని మీకు తెలుసా ? ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇదే ఎక్కువ కావడం విశేషం.

సోషల్ మీడియాదే సింహభాగం
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ కు సంబంధించిన డేటాను 'టాప్10వీపీఎన్' అనే సంస్థ విశ్లేషించింది. ఆయా సమయాల్లో అంతర్జాల వినియోగం నిలిపివేయడం వల్ల ఎంత మేర నష్టం జరిగిందో పేర్కొంటూ ఓ నివేదికను విడుదల చేసింది. కోట్లాది మంది వినియోగిస్తున్న గూగుల్, ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా సేవలు ఆగిపోతే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోతుందో చూద్దాం..

నష్టాల సునామీనే
భారత్ లో 2022కి గాను 1,533 గంటలు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వల్ల 184 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లు టాప్10వీపీఎన్ తెలిపింది. అంటే మన కరెన్సీలో దాదాపు నిమిషానికి లక్షా 63 వేల రూపాయలన్న మాట. 2021లో 1,157 గంటలకు గాను ఈ ఖర్చు 582.8 మిలియన్ డాలర్లుగా తేలినట్లు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2022 లో 50 వేల 95 గంటలకు గాను మొత్తం 23.8 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు పేర్కొంది. 2021తో పోలిస్తే ఇది 45 శాతం అధికం కావడం గమనార్హం. ఇందులో మొదటి స్థానాన్ని రష్యా ఆక్రమించగా, ఇరాన్, కజకిస్తాన్ లు వెనువెంటనే ఉన్నాయి.

ఇంటర్నెట్ ఎందుకు ఆగుతుంది?
పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్నెట్ షట్ డౌన్ పై ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తుంటాయి. ఆయా జిల్లాలు, నగరాలు, గ్రామాల్లో సైతం అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న చోట ప్రభుత్వాలే అంతర్జాల వినియోగాన్ని కొంత కాలం పాటు పూర్తిగా అడ్డుకుంటాయి.
2019 నుంచి చూస్తే 53 దేశాల్లో ప్రధానంగా 380 సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ లు జరిగాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 41.5 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా.

ఎక్కువ సార్లు ఆగింది ట్విట్టరే..
దేశంలో 2022కి గాను 120 మిలియన్లు, 2021లో 59 మిలియన్ల జనాభా ఈ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత వల్ల ప్రభావితమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 710 మిలియన్లుగా ఉంది. 2021తో పోలిస్తే 41 శాతం అధికం. మొత్తం సోషల్ మీడియా 82 గంటలు బ్లాక్ చేయబడగా.. ఎక్కువగా నిలిపివేసిన సామాజిక మాధ్యమంగా ట్విట్టర్ రికార్డు సృష్టించింది. మానవ హక్కుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి రాజస్థాన్ లో 363, జమ్మూ & కశ్మీర్ లో 309 గంటల పాటు అంతర్జాల సేవలను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications