అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం ద్వారా కీలకమైన మౌలిక వసతుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రణాళికలో మొత్తం 16 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం కేబినెట్ సమావేశం అనంతరం మున్సిపల్ మంత్రి డా. పి. నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించారు.
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ను రూపొందించామని, దీనిలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం,రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని చెప్పారు. అమరావతి చుట్టూ రవాణా వ్యవస్థను బలపరచేందుకు IRR నిర్మాణం అత్యంత కీలకమని, రైల్వే స్టేషన్, కొత్త ట్రాక్లు ఈ ప్రాంతంలోని కనెక్టివిటీని విస్తరించనున్నాయని తెలిపారు.

రెండవ దశలో ఏడు గ్రామాల నుండి భూమిని పూలింగ్ చేయనున్నట్లు మంత్రి వివరించారు. మొత్తం 16,666 ఎకరాల భూమిలో, వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల నుండి 7,562 ఎకరాలు, అలాగే వడ్డమానూరు, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిల గ్రామాల నుండి 9,104.57 ఎకరాలు సమీకరించనున్నారు. అదనంగా ప్రభుత్వం వద్ద 3,828 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పటికీ, అందులో ఎక్కువ శాతం కొండల ప్రాంతం కావడంతో వినియోగానికి అనుకూలంగా మార్చే అవసరం ఉందని ఆయన చెప్పారు.
అమరావతి అభివృద్ధి కేవలం రియల్ ఎస్టేట్ విస్తరణతోనే పరిమితం కాకుండా స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటుకు Andhra Pradesh ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది. పరిశ్రమలు లేకపోతే రాజధాని నగర అభివృద్ధి నిలిచిపోతుందనే కారణంతో, భవిష్యత్లో భారీ ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల ప్రవాహం, సాంకేతిక వృద్ధి కోసం స్మార్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ ప్రకటించారు.
అమరావతి అభివృద్ధిలో అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత అవసరమని, దాని లేకపోతే గ్లోబల్ కనెక్టివిటీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. రాబోయే 30 ఏళ్లలో అమరావతి నివాసితుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
2,500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మించి ఒలింపిక్స్తో సహా ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించగల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని నారాయణ వెల్లడించారు. ఈ నగరం ప్రపంచ క్రీడా పటంలో అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని అన్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్లో పాల్గొనబోయే రైతులకు లీజు చెల్లింపులతో పాటు నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్లాట్లు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. రైతులు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications