ప్రైవేట్ రంగ ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తోంది. ఉద్యోగి తన సేవా కాలంలో అకాల మరణం చెందితే.. అతని కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఒకే సారి బీమా మొత్తాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం.
EPFO అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న తాజా EDLI మార్గదర్శకాల ప్రకారం..ఉద్యోగి మరణించిన సందర్భంలో కనీస బీమా రక్షణ రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7.5 లక్షలు వరకు ఉంటుంది. అంటే, ఉద్యోగి జీత స్థాయిని, సేవా కాలాన్ని బట్టి కుటుంబం పొందగల బీమా మొత్తం రూ.2.5 లక్షల నుండి రూ.7.5 లక్షల మధ్య ఉంటుంది. ఫిబ్రవరి 2025లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చేసిన సవరణల ప్రకారం..ఒక సంవత్సరం నిరంతర సేవ లేకపోయినా, ఒక సంవత్సరం పూర్తి కాకముందే మరణించిన ఉద్యోగి కుటుంబం కనీసం రూ.50 వేలు బీమా ప్రయోజనం పొందగలదు. ఇది సర్వీసులోనే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఉపశమనంగా మారింది.

ఉద్యోగి ఏదైనా కారణంతో PF చందాలు ఆపిన తర్వాత ఆరు నెలల లోపే మరణిస్తే, అతను ఇంకా సంస్థ రికార్డులో ఉండేంతవరకు EDLI ప్రయోజనాలు వర్తిస్తాయి. గతంలో అటువంటి కేసుల్లో సేవ నుంచి విడిపోయినట్లుగా పరిగణించి క్లెయిమ్ను తిరస్కరించేవారు. కానీ తాజా సవరణలతో ఈ లోపం సరిచేశారు. ఇప్పుడు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు ఉన్న విరామం కూడా నిరంతర సేవగా పరిగణించబడుతుంది. అంటే ఉద్యోగం మారినప్పటికీ ఆ విరామం కారణంగా EDLI అర్హత కోల్పోవడం జరగదు. గతంలో వారాంతపు సెలవులు లేదా కొన్ని రోజుల గ్యాప్ ఉన్నా ఒక సంవత్సరం నిరంతర సేవ అర్హత నెరవేర్చలేదని క్లెయిమ్లు తిరస్కరించేవారు. తాజా మార్పులతో ఆ సమస్య తొలగించబడింది.
ఉద్యోగి మరణించినప్పుడు అతని నామినీ లేదా చట్టబద్ధమైన వారసుడు EDLI పథకం కింద క్లెయిమ్ చేయవచ్చు. దీనికోసం వారు ఫారం 5 IFను నింపి సమర్పించాలి. ప్రతి క్లెయిమ్దారుడు విడివిడిగా ఫారమ్ నింపాలి. క్లెయిమ్దారు మైనర్ అయితే, అతని/ఆమె తరపున సంరక్షకుడు ఫారమ్ను నింపాలి. ఒకటి కంటే ఎక్కువ మైనర్లు ఉన్నప్పుడు ఒకే ఫారమ్లో సంరక్షకుడు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఫారమ్ను ఉద్యోగి యజమాని ద్వారా EPFO కమిషనర్కు సమర్పించాలి. చెల్లింపు బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీసు ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చేయబడుతుంది. EPFO ప్రకారం అవసరమైన పత్రాలతో కూడిన పూర్తి క్లెయిమ్ను కమిషనర్ స్వీకరించిన తేదీ నుండి 20 రోజుల్లోపు లబ్ధిదారునికి బీమా మొత్తాన్ని చెల్లించాలి.
EDLI పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగుల కుటుంబాలకు ఒక ముఖ్యమైన భరోసా. ఇది ఉద్యోగి మరణం తర్వాత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కనీసం రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు బీమా రక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రతి సాలరీడ్ ఉద్యోగి కుటుంబానికి భద్రత కల్పిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications