2000 Notes: క్లీన్ నోట్ పాలసీ కింద సెంట్రల్ బ్యాంక్ దేశంలో పెద్ద నోటు రూ.2000లను వెనక్కి తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని గడువు వాస్తవంగా గత నెలలో ముగిసింది. కానీ దీనిని అక్టోబర్ 7 వరకు రిజర్వు బ్యాంక్ పొడిగించింది.
ఈ క్రమంలో రేపటితో(అక్టోబర్ 7,2023) నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఉన్న గడువు పూర్తిగా ముగియనుంది. గణాంకాల ప్రకారం మే 19, 2023 వరకు చెలామణిలో రూ.3.56 లక్షల కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా రూ.12,000 కోట్లు విలువైన నోట్లు ఇప్పటికీ తిరిగి రాలేదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంటే ఈ సొమ్ము ఇంకా ప్రజల వద్దే ఉందని ఆర్థం. అయితే వీటిని గడువు తర్వాత మార్చుకోవచ్చా..? లేదా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

ఈ క్రమంలో నోట్లను మార్చుకోని వారికి సెంట్రల్ బ్యాంక్ వెసులుబాటును ప్రకటించింది. అక్టోబర్ 7, 2023 తర్వాత నోట్లు కలిగి ఉన్న వారు దేశంలోని 19 RBI కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. దీనికోసం ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో నోట్లను డిపాజిట్ చేయడానికి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో దేనికైనా ఇండియా పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను పంపవచ్చు. అలాగే దేశంలోని వివిధ సంస్థలు సైతం రిజర్వు బ్యాంక్ కార్యాలయాల ద్వారా తమకు వచ్చే 2000 నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది.
నోట్ల రద్దు సమయంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లలో 87 శాతం సర్క్యులేషన్ నుంచి ఇప్పటికే వెనక్కి వచ్చాయని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే వీటిని వెనక్కి తీసుకున్నప్పటికీ లిక్విడిటీకి ఇబ్బంది కలుగకుండా నోట్లను అందుబాటులో ఉంచినట్లు గతంలోనే వెల్లడించారు. గత శనివారం వరకు డేటాను పరిశీలిస్తే రూ.14,000 కోట్లు విలువైన నోట్లు తిరిగి రావాల్సి ఉందని అప్పట్లో వెల్లడైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications