ChrysCapital ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా ప్రఖ్యాత బేకరీ బ్రాండ్ "థియోబ్రోమా"లో 90% వాటాను సుమారు రూ.2,410 కోట్లకు కొనుగోలు చేయబోతున్నది. థియోబ్రోమాని కైనాజ్ మెస్మాన్ హర్చంద్రాయ్ మరియు ఆమె సోదరి టీనా మెస్మాన్ వైక్స్ స్థాపించారు. ముంబైలో ఒకే ఒక దుకాణంతో ప్రారంభమైన ఈ బ్రాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

భారతీయ బేకరీ మార్కెట్లో ముంబైలో ప్రారంభమైన థియోబ్రోమాను ChrysCapital 90% వాటా కొనుగోలు చేయడంలో ముందుకు వచ్చింది. ఈ భారీ ఒప్పందం విలువ రూ.2,410 కోట్లు. అయితే ఇది ఇంకా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) అనుమతి కోసం వేచి ఉంది.
ChrysCapital అనుబంధ సంస్థలు ఆక్వా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఇన్ఫినిటీ పార్టనర్స్, అట్రైడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ BV థియోబ్రోమా ప్రారంభ ప్రమోటర్లు మరియు ప్రస్తుత పెట్టుబడిదారు ICICI వెంచర్ నుండి వాటాలను కొనుగోలు చేయనున్నాయి.
ఈ పెట్టుబడి, భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (QSR) మరియు కేఫే విభాగంలో ChrysCapital వ్యాపారాన్ని విస్తరించాలన్న వ్యూహాత్మక దృష్టిని సూచిస్తుంది. కరోనా తర్వాత నగరాలలో వినియోగదారుల నుంచి డిమాండ్ బలంగా పెరుగుతోంది.
2017లో ICICI వెంచర్ థియోబ్రోమాలో 42% వాటా సుమారు రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత ఒప్పందంతో ఆ సంస్థ పూర్తిస్థాయి నిష్క్రమణ చేస్తుంది. తొలి ప్రమోటర్లయిన మెస్మాన్ కుటుంబం ఇప్పుడు 10% వాటాను కొనసాగించడానికి, నిర్వాహణలో యథావిధిగా చురుకైన పాత్ర పోషించనున్నారు.
ఒప్పందంపై నియమిత విభాగాల అభిప్రాయం
ఈ ఒప్పందాన్ని CCI పరిశీలిస్తోంది. ఎందుకంటే, కొనుగోలు సంస్థలు బేకరీ లేదా ఫుడ్ రంగంలో నేరుగా వ్యాపారం చేయడం లేదు. అందుకే కార్యకలాపాల్లో పోటీ అంశం లేకుండా, మార్కెట్లో ప్రభావం ఉండదని సంస్థలు చెప్పాయి.
2004లో కైనాజ్ మెస్మాన్ హర్చంద్రాయ్ మరియు టీనా మెస్మాన్ వైక్స్ ముంబయి కొలాబాలో చిన్న బేకరీని ప్రారంభించారు. వారి తండ్రి ఇచ్చిన రూ.1.5 కోట్ల ప్రాథమిక నిధులతో, తొలిసారి దసరా పండుగ రోజు తొలి దుకాణాన్ని ప్రారంభించారు. "థియోబ్రోమా" అనే పేరు గ్రీకు భాషలో "దేవతల ఆహారం" అనే అర్థం. ఈ పదాన్ని వారి మిత్రుడు సూచించాడు. వారి ఆశయం భారత వినియోగదారులకు ప్రీమియం యూరోపియన్-స్టైల్ డెజర్ట్స్ అందించడమే.
ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు విస్తరణ, తక్కువ నిధులు మొదలైన సమస్యలు వెంటాడాయి. హై క్వాలిటీ మెయింటైన్ చేయడం, అధిక ఖర్చులు, మొదటి పెద్ద రుణం (రూ.5 కోట్లు) రావడానికి 2014వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఈ కాలంలో, బ్రౌనీలు, కేకులు, కుకీలు, వంటివి, థియోబ్రోమా మర్కెట్లో స్థానం సంపాదించాయి. యువతలో యూరోపియన్-స్టైల్ బ్రెడ్, డెజర్ట్స్కు మంచి ఆదరణ కన్పించింది.
కోవిడ్ ముందు కేవలం 50 స్టోర్లతో ఉంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 225 దుకాణాలతో పాటు డిజిటల్ ప్రెజెన్స్ కూడా ఉంది. డిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, పుణె, చండీగఢ్ వంటి 30కిపైగా నగరాల్లో సేవలు. FY24లో థియోబ్రోమా ఆదాయం రూ.400 కోట్లు, ఎబిట్డా రూ.60 కోట్లుగా నమోదు అయ్యింది. FY25లో 525-550 కోట్ల ఆదాయం 80-100 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
నిర్వాహకుల ఆశించిందే రూ.3,000 కోట్ల వ్యాల్యూయేషన్ కాగా, తుది ఒప్పందం రూ.2,410 కోట్లకు ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications